సమాజంలో రోజు రోజుకు ఊహించని దారుణాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యని కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితానికి ముగింపు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే పరాయి మహిళపై కన్నేసిన ఓ భర్తకు తన భార్య అండగా నిలిచింది. ఇంతటితో ఆగకుండా దగ్గరుండి భర్తను గదిలోకి పంపి భార్య కాపలాగి నిలిచింది. ఇటీవల చెన్నైలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలుఈ ఘటనలో ఏం జరిగింది? భర్తను దగ్గరుండి గదిలోకి పంపడానికి కారణం ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళనాడులోని వేలూరు జిల్లా రాణిపేటలో భాస్కరన్ (35), దుర్గా (28) దంపతులు నివాసం ఉంటున్నాడు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవిస్తున్నారు. అయితే భర్త గంజాయి సరఫరా చేస్తూ దొంగచాటున బాగానే సంపాదిస్తున్నాడు. అలా ఈ దంపతుల కాపురం బాగానే నడుస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ దంపతులు నివాసం ఉంటున్న పక్కింట్లోకి ఇటీవల నాగమణి అనే మహిళ అద్దెకు దిగింగి. ఆమెకు ఇంటర్ చదివే కూతురు ఉంది. తల్లీకూతుళ్లు ఇద్దరూ కూడా అందంగా ఉండడంతో దుర్గా భర్త భాస్కరన్ ఆ తల్లీకూతుళ్లపై కన్నేశాడు. ఎలాగైన ఆ తల్లీకూతుళ్లపై కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.
అనుకున్నదే ఆలస్యం.. ఇదే విషయాన్ని భాస్కరన్ తన భార్య దుర్గకు వివరించాడు. భర్త మాటను విన్న భార్య ఒక్కసారిగా కోపంతో ఊగిపోయింది. భర్త సంపాదించిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నానని, భర్తకు సపోర్ట్ చేయడం తప్పదని భావించి సిగ్గులేకుండా దుర్గ భర్తకు ఆ విషయంలో ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగానే పక్కింట్లో దిగిన నాగమణితో భాస్కరన్ భార్య దుర్గ మాటా మాటా కలిపి వారితో నమ్మకంగా మెలిగింది. అలా కొన్ని రోజులు గడిచింది. వీళ్లింట్లో వాళ్లు వెళ్లడం, వాళ్ల ఇంట్లోకి వీళ్లు అంతా జరిగిపోయింది. ఇదే మంచి సమయం అనుకున్న భాస్కరన్.. తన భార్య సాయంతో నాగమణి తల్లీకూతుళ్లపై కోరిక తీర్చుకోవాలనుకున్నాడు.
ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఓ ప్లాన్ వేశారు. వీరి పథకంలో భాగంగా ఇటీవల ఓ రోజు రాత్రి భాస్కరన్ భార్య దుర్గా.. ఆ తల్లీకూతుళ్ల ఉంటున్న ఇంట్లోకి తన భర్తను పంపింది. అనంతరం భర్త భాస్కరన్ ను గదిలోకి పంపాకా.. భార్య తాళం వేసి బయట కాపాలాగా నిలబడింది. లోపలికి వెళ్లిన భర్త భాస్కరన్.. తల్లీకూతుళ్లపై కోరిక తీర్చుకున్నాడు. ఇక ఇంతటితో ఆగని భాస్కరన్.. ఇంటర్ అమ్మయిని నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీసుకుని అప్పటి నుంచి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. భాస్కరన్ చేతుల్లో నాగమణి కూతురు నగ్న వీడియోలు ఉండడంతో నాగమణి, ఆమె కూతురు ఏం చేయలేక పోయారు. ఇక భాస్కరన్ వేధింపులతో విసిగిపోయిన నాగమణి ఇటీవల భాస్కరన్ దారుణాలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగమణి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా భాస్కరన్, దుర్గా దంపతులను అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.