1994లో ఒక బాలికను కొంతమంది యువకులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది. ఆమెకు ఒక బాబు కూడా జన్మించాడు. అయితే ఆ బాబును బాలిక కుటుంబసభ్యులు వేరొక కుటుంబానికి ఇచ్చేసి, ఆ బాలికకు పెళ్ళి చేసేశారు. అయితే పదేళ్ళ తర్వాత గ్యాంగ్ రేప్కు గురైందని తెలిసి భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. కట్ చేస్తే ఆ బాబు పెద్దవాడయ్యాడు. తన తల్లి ఎవరు అని తెలుసుకున్న ఆ కొడుకు, ఆమెను కలుసుకున్నాడు. తన తండ్రి ఎవరో చెప్పమని ఆ తల్లిని అడిగాడు. దానికి ఆమె తన బాల్యంలో జరిగిన అత్యాచార సంఘటన గురించి చెప్పింది. సొంత సోదరులే ఆమెపై అత్యాచారం చేశారని తెలియడంతో ఆ కొడుకు వారిపై పోరాటం చేయాలని అనుకున్నాడు. తన తల్లిపై అత్యాచారం చేసినందుకు శిక్షపడేలా చేయాలనుకున్నాడు. కోర్టు మెట్లెక్కాడు. కోర్టు ఆదేశాలతో ఈ కేసుపై పోలీసులు విచారణ జరపడంతో అత్యాచారానికి పాల్పడ్డ నిందితులను గుర్తించారు. వారిలో ఒకడికి డీఎన్ఏ టెస్ట్ చేయడంతో నిందితుల్లో ఒకడి డీఎన్ఏ.. బాధితురాలి కొడుకు డీఎన్ఏకు మ్యాచ్ అయ్యింది. దీంతో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో చోటు చేసుకుంది. దాదాపు మూడు దశాబ్ధాలు గడిచిపోయింది. పన్నెండేళ్ళ వయసున్న బాలికపై 1994లో ఆమె సొంత సోదరులే అత్యాచారానికి పాల్పడ్డారు. మహ్మద్ రజి, నాఖి హాసన్లు సొంత చెల్లెలి మీద పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అయ్యి, 13 ఏళ్ళ వయసులో ఒక బాబుకి జన్మనిచ్చింది. అయితే ఆ బాబుని వేరొకరికి దత్తత ఇచ్చేమని బలవంతం చేశారు. అంతేకాదు ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత ఆమెకు పెళ్ళి చేసి పంపించేశారు. అయితే చేసుకున్నవాడికి నిజం తెలియడంతో ఆమెను వదిలేశాడు. మరోవైపు వేరొకరి ఇంట్లో పెరుగుతున్న కొడుకు.. తన తల్లి గురించి తెలుసుకుని ఆమెను 2021లో కలుసుకున్నాడు. ఆమెకు జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని.. న్యాయం కోసం పోరాడదామని ధైర్యాన్ని ఇచ్చాడు. కోర్టులో పిటిషన్ వేయడంతో 2021 మార్చి 4న కోర్టు ఆదేశాలతో కేసును ఇన్ప్సెక్టర్ ధర్మేంద్ర కుమర్ గుప్తా టేకప్ చేశారు. ఎప్పుడైతే కోర్టు నుండి అరెస్ట్ వారంట్ జారీ అయ్యిందో అప్పుడే వాళ్ళు ఊరొదిలి పారిపోయారు.
ప్రధాన నిందితుడు 48 ఏళ్ల మహ్మద్ రజి హైదరాబాద్లో తలదాచుకోగా, నాఖి హాసన్ ఒడిశాలో తలదాచుకున్నాడు. మల్టీపుల్ టీములని ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. మహ్మద్ రజి హైదరాబాద్ థర్మల్ పవర్ ప్లాంట్లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా మొదట ఒప్పుకోలేదు. దీంతో పోలీసులు డీఎన్ఏ టెస్ట్లు నిర్వహించారు. ల్యాబ్కి డీఎన్ఏ శ్యాంపిల్స్ 2021 జూలైలో పంపించగా.. 2022 ఏప్రిల్ నెలలో రిపోర్ట్లు వచ్చాయి. ఆ రిపోర్ట్స్లో పాజిటివ్ రావడంతో రజినే ఆ కుర్రాడి తండ్రి అని తేలింది. దీంతో మహ్మద్ రజిని అదుపులోకి తీసుకున్నారు. ఇక మరో నిందితుడు నాఖి హాసన్ ఒడిశాలో దాక్కున్నట్లు గుర్తించిన పోలీసులు.. త్వరలోనే పట్టుకుంటామని ఇన్స్పెక్టర్ ధర్మేంద్ర కుమార్ గుప్తా అన్నారు.
ఎప్పుడో 1994లో బాలిక మీద అత్యాచారం జరగడం, అది కూడా సొంత సోదరులే ఈ దారుణానికి ఒడిగట్టడం, ఆమెకు ఒక బాబు పుట్టడం, ఆ బాబుని వేరెవరికో దత్తత ఇవ్వడం, సైలెంట్గా బాలికకి పెళ్ళి చేసి ఏ నేరం చేయనట్టు వారు బతకడం, ఆ కొడుకు పెద్దవాడై 27 ఏళ్ళ తర్వాత అంటే 2021లో తల్లిని చేరుకోవడం, జరిగిన సంఘటన తెలుసుకుని నేరం చేసిన వారిని పట్టించాలనుకోవడం.. ఇదంతా చూస్తుంటే ఒక సినిమా స్టోరీనే తలపిస్తుంది. కర్మ ఎవరినీ వదిలిపెట్టదనడానికి ఈ సంఘటనొక నిదర్శనం. తాను దొరుకుతామని కలలో కూడా అనుకుని ఉండడు మహ్మద్ రజి. కానీ విధి సరదా తీర్చేస్తుంది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
A case that will increase respect for @Uppolice
Accused was hiding in Hyderabad since his DNA sample was taken..
UP: Born out of rape, son finds mother after 27 years, helps nab accused
https://t.co/qm2lRK4eeG pic.twitter.com/wuD8zbSLNr— Kanwardeep singh (@KanwardeepsTOI) August 4, 2022