Social Media Influencer: భర్త చేతిలో ఓ సోషల్ మీడియా సెలెబ్రిటీ దారుణ హత్యకు గురైంది. భర్త ఆమె చేతులు, కాళ్లు కట్టేసి నాల్గవ అంతస్తునుంచి కిందకు తోసేశాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. భార్యను పరాయి వ్యక్తితో చూడటంతో భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, ఘజియాబాద్కు చెందిన రితికా సింగ్ అనే మహిళ ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. ఫుడ్ అండ్ ఫ్యాషన్కు సంబంధించిన వీడియోలు చేస్తుంటుంది. రితాకాకు ఇన్స్టాగ్రామ్లో 44వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక, రితికాకు ఇది వరకే పెళ్లైంది. భర్తతో మనస్పర్థల కారణంగా అతడితో విడిపోయి దూరంగా ఉంటోంది. ఆగ్రాలోని హౌసింగ్ సొసైటీలో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకుని నివసిస్తోంది.
అయితే, భర్తతో విడిపోయిన తర్వాత ఆమెకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇక, ఇద్దరూ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్లోనే సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం కాస్తా రితికా భర్తకు తెలిసింది. అతడు శుక్రవారం రితికా ఫ్లాట్కు వచ్చాడు. ఆమె పరాయి వ్యక్తితో ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యాడు. ఆమెతో గొడవకు దిగాడు. దీంతో రితికా ప్రియుడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత భార్యభర్తల మధ్య గొడవ మరింత పెరిగింది.
భర్త రితికా చేతులు, కాళ్లు కట్టేసి నాల్గవ అంతుస్తులోని ఫ్లాట్ బాల్కనీనుంచి కిందకు తోసేశాడు. కిందపడ్డ ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#cctv footage of the incident. pic.twitter.com/fXet0nO5fC
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) June 24, 2022
ఇవి కూడా చదవండి : Hanamkonda: యువకుడి ప్రేమ టార్చర్!.. ఇంటికొచ్చి మరీ బెదిరింపులు.. అవమానం భరించలేక..