చిన్న చిన్న తప్పులకి కూడా పెద్ద శిక్షలు వేసేస్తున్నారు. తప్పు చేయకపోయినా కూడా అనుమానంతో మనుషులను చంపేస్తున్నారు. అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఒక వ్యక్తిని చిన్న కారణంగా ఒక స్తంభానికి కట్టేసి రాడ్డుతో కొట్టి కొట్టి చంపారు.
చిన్న కారణంగా ఒక వ్యక్తిని స్తంభానికి కట్టేసి ఒక ఇనుప రాడ్డుతో కొట్టి కొట్టి చంపారు. కొట్టద్దు కొట్టద్దు అని వేడుకుంటున్నా కూడా వినకుండా కొడుతూనే ఉన్నారు. అతన్ని కొడుతుంటే చుట్టూ జనం ఆపకుండా అలానే చూస్తున్నారు. దీంతో తనను ఎవరూ కాపాడరని అర్థం చేసుకున్న ఆ వ్యక్తి తన శరీరాన్ని వాళ్లకి వదిలేశాడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో.. చంపేసుకుంటే చంపేసుకోండి అన్నట్టు శరీరాన్ని వదిలేశాడు. ఆ తర్వాత ప్రాణాన్ని వదిలేశాడు. కొడుతుండగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని షాజహాన్ పూర్ లో చోటు చేసుకుంది. బంకిం సూరి అనే రవాణా వ్యాపారి వద్ద శివమ్ జోహ్రీ (32) అనే వ్యక్తి మేనేజర్ గా పని చేసేవాడు.
దొంగతనం చేశాడన్న నెపంతో అతన్ని ఇలా రాడ్డుతో కొట్టి కొట్టి చివరకు చనిపోయేలా చేశారు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా వినకుండా కొడుతూనే ఉన్నారు. యజమానే దగ్గరుండి శివమ్ ను రాడ్డుతో కొట్టించాడు. యజమాని ఆదేశించడంతో ఆ వ్యక్తిని చచ్చేలా కొట్టారు. ఆ తర్వాత తమ చేతులకు మట్టి అంటకుండా శివమ్ మృతదేహాన్ని మంగళవారం రాత్రి మెడికల్ కళాశాల, ఆసుపత్రి దగ్గర పడేసి వెళ్లిపోయారు. అయితే శివమ్ కుటుంబ సభ్యులు అతను కరెంట్ షాక్ వల్ల చనిపోయాడని చెప్పారని పోలీసులు అన్నారు. మృతదేహాన్ని పరిశీలించిన తర్వాత కరెంట్ షాక్ తో మరణించలేదని.. అతని ఒంటి మీద గాయాలు ఉండడంతో హత్య చేసి ఉండవచ్చునని అనుమానంతో దర్యాప్తు ప్రారంభించామని అన్నారు.
బంకిం సూరి దగ్గర శివమ్ ఏడేళ్లుగా పని చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కన్నయ్య హోజరీ సంస్థ నుంచి ఒక పేపర్ ప్యాకేజీ మిస్ అయిన కారణంగా శివమ్ మీద దొంగతనం నేరం మోపి స్తంభానికి కట్టేసి రాడ్డుతో కొట్టారని పోలీసులు తెలిపారు. యజమాని ఆదేశాల మేరకు ఏడుగురు సిబ్బంది కలిసి శివమ్ ను చంపారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో కన్నయ్య హోజరీ యజమాని బంకిం సూరి, నీరజ్ గుప్త సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ హత్య కోసం కారుని ఉపయోగించి ఉండవచ్చునన్న ఉద్దేశంతో కన్నయ్య హోజరీ ప్రాంగణంలో ఉన్న కారును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ మానవీయ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Warning: Disturbing video
In a UP shocker, 4 workers including a manager at a transport company were allegedly held captive, flogged and brutally tortured on suspicion of theft in Shahjahanpur district. Manager Shivam Johri (in the video) succumbed to the brutal torture. pic.twitter.com/ThH9lv23Oq
— Piyush Rai (@Benarasiyaa) April 13, 2023