విశాఖపట్నం ఆర్కే బీచ్లో తప్పిపోయిన వివాహిత సాయి ప్రియ మిస్సింగ్ కేసులో కొత్త ట్విస్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 36 గంటలుగా ఆమె కోసం గాలింపు చేస్తున్న అధికారులు ఆ వార్తతో దెబ్బకు నోరెళ్లబెట్టారు. సముద్రంలో గల్లంతైందని భావించి అంతా అక్కడ గాలింపు చేస్తుంటే.. ఆమెను బంధువులు నెల్లూరులో గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రియుడితో కలిసి సాయి ప్రియ పారిపోయినట్లు భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు.
భర్త శ్రీనివాస్తో వివాహానికి కంటే ముందు.. సాయి ప్రియ నెల్లూరుకి చెందిన రవి అనే వ్యక్తితో ప్రేమలో ఉందని తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఒత్తిడితోనే 2020 జులై 25న ఆమె శ్రీనివాస్ ను పెళ్లాడినట్లు చెబుతున్నారు. శ్రీనివాస్ ఉద్యోగం రీత్యా హైదరాబాద్ లోకాపురం పెట్టారు. అయితే పెళ్లి తర్వాత కూడా సాయి పల్లవి రవితో ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించిందని సమాచారం. కంప్యూటర్ కోర్సు పేరుతో సాయి ప్రియ 4 నెలల క్రితమే వైజాగ్ వచ్చింది.
తమ సెకెండ్ యానివర్సిరీ సెలబ్రేట్ చేసుకునేందుకు శ్రీనివాస్ కూడా ఈనెల 25న వైజాగ్ వెళ్లాడు. అదే రోజు సాయంత్రం భర్తతో కలిసి బీచ్కు వెళ్లిన సాయి ప్రియ ఆ తర్వాత కనిపించకుండా పోయింది. ప్రియుడికి ముందే సమాచారం ఇచ్చి.. శ్రీనివాస్ కు తెలియకుండా పారిపోయినట్లు చెబుతున్నారు. అసలు విషయం తెలియక శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండ్రోజులుగా ఆమె కోసం గాలించారు.
36 గంటలపాటు కొనసాగిన సహాయక చర్యలకు దాదాపు రూ.70 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అయినట్లు విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ తెలిపారు. వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించినట్లు వెల్లడించారు. ఆమె ఆచూకీ నెల్లూరు లభించినట్లు సమాచారం ఉందన్నారు. ఆమెను వైజాగ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీధర్ తెలిపారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.