ఆ యువతి పేరు సాగరిక. వయసు 19 సంవత్సరాలు. ఆమె స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం, పుల్జాల గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన సాగరిక తన అమ్మానాన్నలతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం రాగన్నగూడ సమీపంలో నివాసం ఉంటున్నారు. అయితే సాగరికకు స్థానికంగా ఎడ్ల అంజి అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం రాను రాను ప్రేమగా చిగురించింది. ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నారు.
దీంతో ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే గత 3 నెలల క్రితం సాగరిక తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి ప్రియుడితో పాటే ఉప్పునుతల మండలం, అయ్యవారిపల్లిలో నివాసం ఉండేవారు. అయితే పెళ్లైన కొన్నాళ్ల నుంచి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఇది కూడా చదవండి: Car: షాకింగ్ : రోడ్డుకి మధ్యలో పెద్ద గొయ్యి.. గోతిలో పడ్డ కారు!
కట్ చేస్తే విరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో భర్తతో గొడవ పడి సాగరిక ఈ నెల 5న ఇంట్లో ఎవరి లేని సమయంలో బయటకు వెళ్లింది. ఎక్కడికి వెళ్లిందోనని కుటుంబ సభ్యులు చుట్టూ ప్రక్కల వారిని బంధువులను అడిగినా ఆచూకీ లభించలేదు. దీంతో సాగరిక తండ్రి బాలరాజు ఖంగారు పడ్డాడు. ఏం చేయాలో తెలియక సోమవారం ఆదిబట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.