దేశంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతోంది. అడ్డగోలుగా మైనర్ బాలికలపై అత్యాచారాలు, కాదంటే హత్యలు. ఇవే నేటి కాలంలో జరుగుతున్న అఘాయిత్యాలు. ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఓ దారుణం వెలుగు చూసింది. 14 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఓ 40 ఏళ్ల దుర్మార్గుడు.., బాలిక గర్భం దాల్చలేదని నరకం చూపించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
అసలేం జరిగిందంటే? రాజస్థాన్ లోని ధోల్ పూర్ అనే గ్రామంలో ఓ మహిళకు గతంలో పెళ్లి జరిగింది. కొంత కాలానికి ఈ దంపతులకు ఓ కూతురు కూడా పుట్టింది. కాగా ఆ మహిళ భర్త గతంలోనే చనిపోయినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒంటరిగా ఉంటున్న ఆ మహిళ మరో మగాడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక కూతురికి 14 ఏళ్ల వయసు వచ్చింది. ఈ క్రమంలోనే ఆ మహిళ పడక సుఖానికి కూతురు అడ్డుగా ఉందని గ్రహించింది. ఇక ఎలాగైన కూతురుని లేకుండా చేయాలనుకుంది. దీంతో ప్రియుడితో పాటు కలిసి తన కూతురుని అమ్మేందుకు పథకం గీసింది.
ఇందులో భాగంగానే రూ.3 లక్షలకు ఆ మహిళ తన కూతురిని 40 ఏళ్ల వ్యక్తికి అమ్మేసింది. కొనుగోలు చేసిన ఆ వ్యక్తి ఆ బాలికను పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక కొంత కాలానికి ఆ బాలికను ఆ 40 ఏళ్ల వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. రోజులు గడుస్తున్నా.., తన భార్య గర్భవతి కాకకపోవడంతో అతడు దుర్మార్గుడిగా మారాడు. దీంతో ఆ బాలికను కొట్టడం, వాతలు పెట్టడం వంటి దారుణాలు చేస్తూ బతికుండగానే నరకాన్ని చూపించాడు. ఈ దుర్మార్గుడి దారుణాలను తట్టుకోలేని ఆ బాలిక అతడి చెర నుంచి తప్పించుకుని జైపూర్ పారిపోయింది.
ఈ విషయం తెలుసుకున్న బచ్ పన్ బచావో ఆందోళన్ సంస్థ ప్రతినిధులు ఆ బాలికను చేరదీశారు. జరిగిన దారుణంపై స్పందించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక తల్లి, ఆమె ప్రియుడు ,గర్భం కోసం వేధించిన ఆ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.