భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం కామన్. ఇంతదానికే కొందరు దంపతులు హత్యల నుంచి ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. ఇలా ఎంతోమంది భార్యాభర్తలు క్షణికావేశంలో ఊహించని దారుణాలకు కత్తులు నూరుతూ చివరికి నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే క్షణికావేశంలో హద్దులు దాటిన ఓ భర్త కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఇక ఇంతటితో ఆగక ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవల రాజస్థాన్ లో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలి జిల్లా రుద్రాపూర్ లో శిశుపాల్, రింకీ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కొన్నేళ్ల కిందటే వీరికి వివాహం జరిగింది. భర్త స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పని చేస్తూ కుటుంబాన్నినెట్టుకొస్తున్నాడు. ఇక పెళ్లైన కొన్నాళ్లకి ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. దీంతో వారి కాపురం అప్పుడి వరకు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా సాగుతూ వచ్చింది. ఇదిలా ఉంటే గత కొన్నిరోజుల నుంచి భార్యాభర్తల సంసారంలో గొడవలు వచ్చి చేరాయి. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. వీరిద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది పరిస్థితి.
అయితే ఈ దంపతులు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త శిశుపాల్ భార్య రింకీని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శిశుపాల్ సైతం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో వీరి కుమారుడు అరుపులు వేయడంతో స్థానికులు గమనించి పరుగు పరుగున వచ్చారు. వారు వచ్చి చూడగా రింకీ రక్తపు మడుగులో పడి ప్రాణాలు కోల్పోగ., భర్త శిశుపాల్ ఒంటి నిండా గాయాలతో ఇంట్లో పడి ఉన్నాడు.
వెంటనే అలెర్ట్ అయిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు శిశుపాల్ ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శిశుపాల్ ను అరెస్ట్ చేశారు. అయితే తల్లి మరణించి, తండ్రి జైలుకు వెళ్లడంతో ఆ దంపతుల కుమారుడు తల్లిదండ్రులు లేని అనాథలా మారిపోయాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.