హనీ ట్రాప్లతో డబ్బున్న వాళ్లను దోచుకోవటం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువయిపోయింది. కొంతమంది గ్రూపులుగా తయారై దారుణాలకు తెగిస్తున్నారు. వీలైనంత దోచుకుంటున్నారు. తాజాగా, ఛత్తీష్గఢ్ రాష్ట్రంలో ఓ హనీ ట్రాప్ ఘటన బయటపడింది. కొంతమంది ఓ బిజినెస్ మ్యాన్ ఇంట్లోకి చొరబడి హనీట్రాప్కు పాల్పడ్డారు. పక్కాప్లాన్తో ఆయనను మోసం చేశారు. అయితే, ఆయన దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో నిందితులు కటకటాల పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. ఛత్తీష్గఢ్లోని రాయ్పూర్కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ తన ఇంటిని అమ్మటానికి చూస్తున్నాడు. ఇందుకోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే అతడికి సంజయ్ నగర్ ప్రాంతానికి చెందిన సుల్తాన్ అన్సారీ మౌలానాతో పరిచయం ఏర్పడింది. అతడు బిజినెస్ మ్యాన్ ఇంటిని అమ్మిపెడతానని చెప్పాడు. ఓ రోజు బిజినెస్ మ్యాన్కు రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. ఆయన అందులోని ఓ నెంబర్కు ఫోన్ చేశాడు. ఓ అమ్మాయి ఫోన్లో మాట్లాడింది. ఇంటిని చూడటానికి వస్తున్నట్లు చెప్పింది. మధ్యాహ్నం యువతి ఆయన ఇంటికి వచ్చింది. ఆయన సదరు యువతికి ఇళ్లు మొత్తం చుట్టి చూపించాడు. తర్వాత కాలకృత్యం తీర్చుకోవటానికి బాత్రూమ్కు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చాడు. అంతే! అక్కడి గదిలోని దృశ్యానికి అతడి మతి పోయింది. ఇళ్లు చూడటానికి వచ్చిన యువతి నగ్నంగా ఒంటిపై బట్టలు లేకుండా ఉంది.
దీంతో బిజినెస్ మ్యాన్ షాక్ తిన్నాడు. షాక్లోంచి తేరుకునే లోపే కొంతమంది అక్కడికి వచ్చారు. ఇద్దర్నీ వీడియో తీయటం మొదలుపెట్టారు. తర్వాత బిజినెస్ మ్యాన్ ప్యాంట్స్ విప్పి మళ్లీ వీడియో తీశారు. వీడియో వైరల్ చేస్తామని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. ఆయన లక్ష రూపాయలకు పైగా వారికి ఇచ్చాడు. వారు వీడియోను డిలీట్ చేస్తామని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ ఫోన్ చేసి బెదిరించారు. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురి అదుపులోకి తీసుకున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.