ఈ రోజుల్లో తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిల కన్న ప్రేమ వివాహాలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని అయినా సంతోషంగా ఉంటున్నారా అంటే అదీ లేదు. పెళ్లైన కొన్నాళ్లకే మనస్పర్ధలు, వివాహేతర సంబంధాలు వంటి కారణాలతో ఆ దంపతులు నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యపై అనుమానంతో భార్యను హత్య చేసి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు భర్త భార్యను ఎందుకు చంపాడు? ఆ తర్వాత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పంజాబ్ జలందర్ మక్సుదాన్ పరిధిలోని హరగోవింద నగర్ లో హరిందర్ యాదవ్, పూజా దంపతులు నివాసం ఉంటున్నాడు. వీరు గత 6 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త హరిందర్ యాదవ్ స్థానిక ఓ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం బాగానే సాగుతూ వచ్చింది. అలా వీరి కాపురం ఆనందంగా సాగుతున్న తరుణంలోనే భర్త భార్యతో గొడవకు దిగుతుండేవాడు. విషయం ఏంటంటే? భర్త హరిందర యాదవ్ కు భార్య పూజపై అనుమానం ఉండేది. నా భార్య అందంగా ఉందని, దీంతో పరాయి మగాళ్లతో మాట్లాడుతుందేమోనని భర్తను అనుమానం వెంటాడుతుండేది. ఇక ఇదే కారణంతో భార్యాభర్తలు ఇద్దరూ తరుచు గొడవలు పడుతుండేవారు.
ఈ క్రమంలోనే భర్త హరిందర్ యాదవ్ ఇటీవల తన భార్య పూజతో గొడవ పడ్డాడు. ఈ సమయంలోనే భార్యాభర్తలు ఇద్దరు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భార్యపై దాడి చేసి ఆ తర్వాత హత్య చేశాడు. అనంతరం భయంతో వణికిపోయిన హరిందర్ ఏం చేయాలో అర్థంకాక చివరికి తాను ఆత్యహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అయితే పోలీసుల విచారణలో.. భర్త హరిందర్ యాదవ్ భార్యను అనుమానిస్తుండేవాడని, దీని కారణంగానే తరుచు భార్యాభర్త మధ్య గొడవలు కూడా జరిగేవని తెలిపారు. ఇక ఇదే కారణంతో భర్త భార్య పూజను ఇటీవల హత్య చేసి భయంతో తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇటీవల వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.