Shantabai: కర్ణాటక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్లో అక్రమాలకు పాల్పడిన శాంతి బాయి దంపతులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. గత కొన్ని నెలలుగా పరారీలో ఉన్న వారిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. శాంతి బాయి, ఆమె భర్త బసయ్య నాయక్లు హైదరాబాద్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దర్నీ పట్టుకున్నారు. దంపతులను కర్ణాటకలోని సీఐడీ ఆఫీసుకు తరలించి విచారిస్తున్నారు. కాగా, కర్ణాటకలోని కలబుర్గి జిల్లా, కోనాపురకు చెందిన శాంతిబాయి నాయక్కు ఎస్ఐ కావాలనేది జీవితాశయం. ఎంత చదివినా పరీక్షల్లో పాస్ కాలేను అనుకుందో ఏమో తెలియదు కానీ, భర్త బసయ్య నాయక్తో కలిసి అక్రమాలకు పాల్పడింది.
మంజునాథ మేలకుంద అనే వ్యక్తితో భార్యాభర్తలిద్దరూ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం 10 లక్షల రూపాయలు చెల్లించారు. మంజునాథ దివ్య అనే మహిళతో.. పరీక్ష పేపర్లు దిద్ది, పాస్ చేయటానికి 50 లక్షల రూపాయల ఒప్పందం చేసుకున్నాడు. దివ్య.. శాంతి బాయితో పాటు మరికొందరి పరీక్ష పేపర్లను దిద్ది వారు పాస్ అయ్యేలా చేసింది. అయితే, వారు ఊహించని విధంగా ఈ అక్రమాలు బయటపడ్డాయి.
మోసాలకు పాల్పడిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, శాంతి బాయి దంపతులు మాత్రం పరారయ్యారు. ఇక అప్పటినుంచి అజ్ఞాతంలో ఉంటున్నారు. దాదాపు రెండు నెలల తర్వాత హైదరాబాద్లో దొరికారు. శాంతి బాయి తన కోరిక తీర్చుకోవటానికి భర్తను బలిపశువును చేసింది. ఆమె వక్రబుద్ధి కారణంగా కాపురం కూలి పోయింది. తప్పు అని చెప్పాల్సిన భర్త ఆమెను ప్రోత్సహించి కటకటాల పాలయ్యాడు. లక్షలు పోయాయి.. లక్షణమైన జీవితాలు జైలు పాలయ్యాయి. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి: భర్త నిద్రపోతుంటే.. రాత్రి ప్రియుడితో కలిసి కారులో! ఇలాంటి భార్య కూడా ఉంటుందా?