ఆమె ఆరోగ్యం బాగ లేక గత రెండేళ్ల కిందట మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక చేసేదేం లేక చివరికి ఆమెకు అంత్యక్రియలు జరిపించారు. అలా రెండేళ్లు గడిచి పోయింది. కూతురు చనిపోయిందని చేదు నిజాన్ని జీర్ణించుకోలేక ఆమె తల్లిదండ్రులు అనుక్షణం బాధపడుతూనే ఉన్నారు. కట్ చేస్తే రెండేళ్ల తర్వాత ఆ మహిళ తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిపిన కూతురు శవానికి పోస్ట్ మార్టం నిర్వహించాలనుకున్నారు. ఇక అనుకున్నదే ఆలస్యం రెవెన్యూ, పోలీసుల సాయంతో పోస్ట్ మార్టం నిర్వహించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
విజయవాడ గన్నవరం పరిధిలోని ఇస్లాంపేటటకు చెందిన సఫియాబేగంకు 2015లో వివాహం జరిగింది. ఇక పెళ్లైన కొంత కాలం తర్వాత సఫియా బేగం భర్త సలిముల్ల షరిఫ్ తో గుంటూరులో నివాసం ఉన్నారు. సిఫియా బేగం ఇక్కడే బ్యాంకులో పని చేస్తుండడతో దంపతులు కొంత కాలం పాటు ఇక్కడే కాపురాన్నిసాగించారు. కానీ సఫియా బేగం ఉన్నట్టుండి 2020లో ఆరోగ్యం బాగ లేక మరణించింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇక చేసేదేం లేక సఫియా బేగంకు అంత్యక్రియలు జరిపించారు. అలా 2 ఏళ్లు గడిచిపోయింది. కానీ సఫియాబేగం మరణంపై ఎందుకో ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది.
దీంతో రెండేళ్ల కిందట చనిపోయిన మా కూతురు మరణానికి ఆమె భర్త, అత్తమామలే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇక చివరికి పోస్ట్ మార్టం నిర్వహించాలని భావించిన పోలీసులు రెండేళ్ల తర్వాత సఫియా బేగంకు రెవెన్యూ, పోలీసుల సాయంతో సమాధిలో నుంచి తీసి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతదేహం నుంచి కొన్ని అవశేషాలు సేకరించి ఫోరెన్స్ ల్యాబ్ కు పంపించారు. ఇక ఫోరెన్స్ రిపోర్ట్ లో ఏం తేలనుందని ఆమె తల్లిదండ్రులు ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.