తొమ్మిది నెలలు మోసి పెంచి పెద్ద చేసి తమ కొడుకు పెద్ద ప్రయోజకుడు కావాలని ప్రతీ తల్లీదండ్రుల భావిస్తారు. అలా పెంచి పెద్ద చేసినా తల్లిదండ్రులనే వృద్దాశ్రయంలో పంపించటం లేదంటే నడి రోడ్డుపై వదిలేయటం జరుగుతున్నాయి. తాజాగా ఓ వృద్ధుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు నడి రోడ్డుపై పడేసిన ఘటనే యాదాద్రి జిల్లాలోని అడ్డగూడురు మండలం కాంచనపల్లిలో చోటు చేసుకుంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు పండుటాకుల లాంటి బతికున్న వృద్ధుడిని చాపపుట్టి చెట్ట పొదల్లో వదిలేసి వెళ్లారు.
దీంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని వైద్యం నిమ్మిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక వృద్ధుడిని ఎవరూ పడేసి ఉంటారని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆ వృద్ధుడి నుంచి రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కన్న కొడుకులే ఇలా వదిలేశారా లేదంటే మరింకెవరైనా ఇలా పడేసి ఉంటారనేది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.