పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో ఓ భర్త తన భార్యను దారుణంగా హతమర్చాడు. తాజాగా జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. పాలకుర్తి మండలం ఎల్కలపల్లికి గ్రామానికి చెందిన బాపు అనే వ్యక్తికి పెళ్లై క్రాంతి, విమల్ అనే పిల్లలు జన్మించారు. అయితే కొంత కాలానికి బాపు అతని భార్య మరణించడంతో అప్పటి నుంచి ఆ ఇద్దరు పిల్లలను అమ్మమ్మ అయిన కొల్లూరు జక్కమ్మ చేరదీసి పెంచి పెద్ద చేసింది. ఇక పెరిగి పెద్దయ్యాక జక్కమ్మ కుమారుడైన అజయ్ తన మేనకోడలైన క్రాంతిని 2015 పెళ్లి చేసుకున్నాడు.
కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అయితే రోజులు మారే కొద్ది అజయ్ తాగుడుకు బానిసై రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. రోజూ తాగొచ్చి భార్య అయిన క్రాంతిపై అనుమానంతో తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడు. ఇంతటితో ఆగకుండా వివాహేతర సంబంధాన్ని అంటగట్టి క్రాంతిని మానసికంగా హింసకు గురి చేసేవాడు. తల్లిదండ్రులు లేని క్రాంతి భర్త కొట్టినా, తిట్టినా భరిస్తూ వచ్చింది. అయితే ఇటీవల మరోసారి అజయ్ తాగొచ్చి భార్య క్రాంతితో గొడవకు దిగాడు. ఇద్దరు మధ్య మాటా మాటా పెరగడంతో వీరి గొడవ పతాక స్థాయికి వెళ్లింది.
ఇక కోపంతో ఊగిపోయిన అజయ్ తన భార్యను దారుణంగా కొట్టాడు. భర్త దాడిలో క్రాంతి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. తల్లిదండ్రులు లేని అభాగ్యురాలిని దారుణంగా హత్య చేసిన భర్త అజయ్ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.