ఆమెకు పెళ్లై ఆరు నెలలు అవుతుంది. ప్రేమించిన వాడినే మనువాడాలనుకుని చివరికి ప్రియుడినే పెళ్లి చేసుకుంది. దీంతో ఎన్నో ఆశలతో ఆ యువతి అత్తింట్లో అడుగు పెట్టింది. మొదట్లో భర్త బాగానే ఉన్నట్లు నటిస్తూ.. రోజులు మారుతున్న కొద్ది రాక్షసుడిలా తయారయ్యాడు. ప్రేమించిన వాడినే చేసుకున్నా.., ఆమెకు కోరుకున్న సుఖం దక్కలేదు. కొంత కాలానికి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పుట్టుకొచ్చాయి. దీంతో అనేక రాత్రుళ్లు ఆ మహిళ కన్నీళ్లతో సహవాసం చేసింది. ఇక ఇలాంటి బతుకు నాకొద్దు అనుకుందో ఏమో తెలియదు కానీ.. చివరికి ఆ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది పెద్దపల్లి జిల్లా పాలకూర్తి మండలం కుక్కలగూడురు. ఇదే గ్రామానికి చెందిన రాకేష్, అనూష (27) ఆరు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లైన రెండు, మూడు నెలలు మాత్రమే ఈ దంపతులు సంతోషంగా గడిపారు. అలా రోజులు గడుస్తున్న క్రమంలోనే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో అనేక సార్లు ఈ దంపతులు గొడవలు కూడా చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. నేను కోరుకున్న సుఖం దక్కలేదని అనూష ప్రతీ రోజూ రాత్రిళ్లు కన్నీళ్లతో సహవాసం చేసేది. అలా తన దుఖాన్ని దిగమింగుకుంటూ సంసారాన్ని నెట్టుకుంటూ వస్తుంది. కానీ ఈ దంపతుల గొడవలకు మాత్రం అడ్డకట్ట పడడం లేదు.
అయితే ఇటీవల కూడా అనూషకు, రాకేష్ మధ్య మరోసారి గొడవ జరిగింది. భర్త తీరుతో సహించలేకపోయిన అనూష ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇలాంటి బతుకు నాకొద్దని.. ఆదివారం తెల్లవారు జామున పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే స్పందించిన ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసికెళ్లగా అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించారు. ఈ వార్తతో అనూష తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఈ ఘటనపై అనూష తల్లిదండ్రులు భర్త రాకేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.