అన్నమయ్య జిల్లాలకు చెందిన ఓ యువకుడు, యువతికి మూడు నెలల కిందట పెళ్లి జరిగింది. పెద్దలు కుదుర్చిన వివాహం కావడంతో వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైన ఈ జంటను చూసి బంధువులంతా మురిసిపోయారు. అయితే తాళి కట్టిన భర్తతో కాపురాన్ని చేయాల్సిన ఆ భార్య వారం రోజులు తిరిగే సరికి మరో వ్యక్తితో లవ్ లో పడింది. తిరా మూడు నెలలు గడిచేసరికి ప్రియుడితో పాటు జంప్ అయి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానాకి గురై మరణించింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. . ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం అగ్రహార గ్రామం. రెడ్డివారి పల్లెకు ప్రాంతానికి చెందిన హర్షిత అనే యువతిని మేలుపట్లకు చెందిన జాషువాతో పెద్దలు పెళ్లి కుదిర్చారు. ఇరు కుటుంబాల ఇష్టాల మేరకు వీరిద్దరికి బంధువుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. వీరి పెళ్లై వారం రోజులు అయింది. తాళికట్టిన భర్తతో కాపురం చేయాల్సిన హర్షిత పెళ్లైన వారినికే పక్క చూపులు చూసింది. ఏకంగా సొంత మరిది రాజేష్ తో క్లోజ్ గా ఉంటూ అతనితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది.
ఇది కూడా చదవండి: Chandrayangutta: రాష్ట్రాలు వేరైన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసిన భార్య!
ఇలా కొన్నాళ్ల పాటు వీరి చీకటి సంసారం భర్తకు తెలియకుండా పరుగులు తీసింది. కొన్నాళ్లకి ఇదే విషయం హర్షిత తల్లికి తెలియడంతో మందలించే ప్రయత్నం చేసింది. అయితే హర్షిత మెల్ల మెల్లగా భర్త జాషువతో దూరమవుతూ.. మరిది రాజేష్ తో దగ్గరవుతోంది. ఈ నేపథ్యంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. దీంతో భర్తతో ఉండడం హర్షితకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైన ప్రియుడితో ఉండాలని భావించి హర్షిత ఈ నెల 13న ఏకంగా మరిదితో కలిసి జంప్ అయింది. దీంతో విషయం తెలుసుకున్న రాజేష్ తండ్రి పోలీసులుకు ఫిర్యాదు చేయగా వారు విజయవాడలో ఉన్నారని తెలిసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు విజయవాడ నుంచి వారిని స్వస్థలానికి తీసుకొస్తుండగా ఒంగోలు మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హర్షిత అక్కడికక్కడే మరణించగా ప్రియుడు రాజేష్ తో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.