ఇష్టం లేని పెళ్లి చేశారని ఓ భర్త ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. భార్యను దారుణంగా హత్య చేసి చేతులు దులుపుకుందామనేసరికి పోలీసుల ఎంట్రీతో అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలం గోళ్లమూడి గ్రామానికి చెందిన పేరం భూలక్ష్మి (22)కి ఇదే గ్రామానికి చెందిన పేరం గోపీతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది.
కానీ భూలక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి గోపీకి అస్సలు కూడా ఇష్టం లేదు. ఇదే విషయాన్ని తల్లిదండ్రులకు గతంలో చెప్పినా వారు పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయేవాడు. అయితే పెళ్లైన తర్వాత తప్పని పరిస్థితుల్లో భార్య భూలక్ష్మితో అంటిముట్టనట్టుగా ఉంటూనే కాపురం చేశాడు. దీంతో కొన్నాళ్లకి వీరికి నాలుగేళ్ల కుమార్తె జన్మించింది. కాగా ప్రస్తుతం భూలక్ష్మి ఎనిమిది నెలల గర్భంతో ఉండడం విశేషం. అయితే ఈ క్రమంలో గోపీ ఎలాగైన భర్య నుంచి తప్పించుకోవాలని చూశాడు.
ఇది కూడా చదవండి: Mumbai: బతికుండగానే భార్యను తగులబెట్టిన భర్త! కారణం ఏంటంటే?
ఇందులో భాగంగానే ఓ ప్లాన్ ను కూడా గీసి భార్యను చంపాలనే భావనకు వచ్చాడు. ఇక భార్య రెండో కాన్పు కావటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయిద్దాని చెప్పి ఆస్పత్రికి వెళ్లకుండా నేరుగా కంచికచర్లలోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ భోజనం చేసి రాత్రి సమయంలో తిరిగి గోళ్లమూడి వెళ్దామని బైక్పై బయలుదేరారు. కీసర దగ్గరలోని నేషనల్ హైవేపై ఎన్ఎస్పీ కెనాల్ సమీపంలోకి రాగానే భర్త గోపీ భూలక్ష్మితో గొడవ పడడ్డాడు.
ఇక అంతటితో ఆగకుండా చీర, తాళిబొట్టు తాడుతో ఆమె మెడకు బలంగా ఉరి బిగించాడు. దీంతో భార్య భూ లక్ష్మి స్పృహ కోల్పోయింది. ఏం చేయాలో తెలియక 108కు చేసి ఫోన్ వాంతులు, అవుతున్నాయంటూ వారిని నమ్మించాడు. ఇక నిజమేనని భావించిన 108 సిబ్బంది నేరుగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసు కెళ్లేలోపే అప్పటికే ఆమె మృతిచెందింది. ఈ విషయం తెలుసుకున్న భూలక్ష్మి బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భూ లక్ష్మి మరణంపై అనుమానమొచ్చిన ఆమె కుటింభికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా భూలక్ష్మిని చంపింది భర్తే అని తేలడంతో అతనిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.