పెళ్లంటే నూరేళ్ల పంట.. ఈ బంధంలో రెండు జీవితాలే కాదు.. రెండు కుటుంబాలు ముడిపడి ఉంటాయి. ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఏ నిర్ణయం తీసుకున్నా మొదట ఎఫెక్ట్ అయ్యేది ఆ రెండు కుటుంబాలే. కానీ, తల్లిందడ్రులు, పెద్దలు ఇలాంటివి ఏమీ పట్టించుకోకుండా కొందరు వారి ఇష్టానికి నిర్ణయాలు తీసుకుని కన్నవాళ్లకు కన్నీళ్లు మిగులుస్తున్నారు. అటు పెద్దలు కూడా వారి నిర్ణయమే నెగ్గాలని పిల్లలకు ఇష్టంలేని పెళ్లిళ్లు చేసి వారు ఆత్మహత్యలు చేసుకునేందుకు పరోక్షంగా కారణం అవుతున్నారు. తాజాగా ఓ కొత్త పెళ్లికొడుకు ఆత్మహత్య ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పుణ్యవరంలో ఈ నెల 4న కంభంపాటి నరేశ్ కు అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఆ తర్వాతి రోజు జూన్ 5న రాత్రి రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. రిసెప్షన్ లో నరేశ్ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ఎంతో సరదాగా గడిపాడు. రిసెప్షన్ మొత్తం ఎంతో అట్టహాసంగా జరిగింది. భోజనాలు చేసి, ఫొటోలు దిగి అందరూ పడుకున్నారు. నరేశ్ కూడా అందరితో కలిసి రెస్ట్ తీసుకున్నాడు.
తెల్లవారుజామున నరేశ్ ఇంట్లోని టాయిలెట్ కు వెళ్లాడు. వెళ్లిన తర్వాత ఎంతకీ నరేశ్ బాత్ రూమ్ లో నుంచి బయటకు రావడం లేదు. చాలాసేపు ఎదురుచూసిన తర్వాత కుటుంబసభ్యులు నరేశ్ ను కేకలు వేస్తూ పిలిచారు. కానీ, నరేశ్ ఎంతకీ తలుపు తీయడం లేదు. తర్వాత కుటుంబసభ్యులు అంతా కలిసి టాయిలెట్ తలుపు బద్దలు కొట్టారు. లోపల ఉన్న దృశ్యం చూసి అందరికీ నోట మాట రాలేదు.
టాయిలెట్ లోపల కొత్త పెళ్లికొడుకు నరేశ్ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించాడు. బ్లేడుతో అతని గొంతు, చేతులు, నరాలు కట్ చేసుకున్నాడు. బాత్ రూమ్ మొత్తం అతని రక్తంతో తడిసిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే అసలు నరేశ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? అంత కష్టం ఏమొచ్చింది అనేది దర్యాప్తు తేలాల్సి ఉంది. ఈ ఘటనపై మీ ఆభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.