ఈ మధ్యకాలంలో అత్యాచార దాడుల విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఐదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల పండు ముసలవ్వల వరకు ఎవరిని కూడా వదలకుండా కొందరు విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇంతటితో ఆగకుండా అత్యాచార యత్నానికి పాల్పడుతున్నారు. దీనికి సహకరించకపోతే హత్యలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ 70 ఏళ్ల ముసలవ్వపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో రేణయ్య అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇక తాగుబోతుగా మారిన ఆ యువకుడు జులాయిగా తిరుగుతున్నాడు. అయితే ఇదే గ్రామంలో ఓ 70 ఏళ్ల వృద్దురాలు నివాసం ఉంటుంది. రేణయ్య అతిగా మద్యం సేవించి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు.
ఇది కూడా చదవండి: Kondapur: యువతిపై కిరాయి మనుషులతో అత్యాచారం చేయించిన మహిళ! వీడియోలు తీసి!అయితే ఈ క్రమంలోనే రేణయ్య తెల్లవారు జామున 70 ఏళ్ల వృద్దురాలు ఇంటి వద్ద కూర్చోని ఉంది.దీంతో ఆమెపై కన్నేసిన ఆ దుర్మార్గుడు ఒంటరిగా ఉన్న ఆ ముసలవ్వపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఇదే విషయం ముసలవ్వకు ఆమె కుటంబ సభ్యులకు వివరించింది. ఇక బాధితురాల కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వృద్దురాలిని వైద్య పరీక్షల కోసం నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.