ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో.. ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో తెలియదు. కానీ ఆమెను చూస్తే.. పిల్లలే ప్రాణంగా.. కేవలం వారి కోసం సమస్యల్ని ఎదిరించి బతుకుతుంది అని అర్థం అవుతోంది. పొద్దంతా ఎక్కడెక్కడో తిరిగి.. రాత్రికి రైల్వే స్టేషన్లో పిల్లలతో కలిసి తలదాచుకుంటుంది. సమస్యలకు దూరంగా వచ్చిన.. అవి మాత్రం ఆమెను వదల్లేదు. అర్థరాత్రి మృత్యువు ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. పిల్లలతో కలిసి నిద్రపోతున్న ఆమెను లేపి.. రైలు కింద పడేసి.. పిల్లలతో పరారయ్యాడు ఓ వ్యక్తి. ఈ భయానక దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డవ్వడంతో దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ వివరాలు..
ఈ దారుణ సంఘటన ముంబై సమీపంలోని వసాయ్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ఇక ఇంతటి కిరాతక చర్యకి పాల్పడ్డ వ్యక్తిని మృతురాలి భర్తగా భావిస్తున్నారు పోలీసులు. ఇక ఆదివారం మధ్యాహ్నం నుంచి మృతురాలు, ఆమె పిల్లలు ఇద్దరు వసాయ్ రైల్వే స్టేషన్లోనే ఉన్నారు. రాత్రి అక్కడే బల్లపై నిద్రపోయారు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున నాలుగింటి సమయంలో ఓ వ్యక్తి మృతురాలు నిద్రపోతున్న దగ్గరకు వచ్చాడు. ఆమెను లేపి.. కొన్ని సెకన్ల పాటు మాట్లాడాడు. సరిగా అదే సమయానికి పట్టాలపైకి ఓ రైలు వస్తోంది. అంతసేపు మాఎతో మాట్లాడుతున్న వ్యక్తి.. ఉన్నట్లుండి ఆమెను రైలు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఆ తర్వాత అతడు బల్లపై నిద్రిస్తోన్న ఇద్దరు పిల్లలనులేపి… నిద్రమత్తులో ఉన్నవారిని అలాగే లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఈ దారుణం మొత్తం సీసీటీవీలో రికార్డయ్యింది. ఇక నిందితుడు.. వసాయ్ నుంచి పారిపోయి కల్యాణ్కు చేరుకున్నాడు. చివరకు భీవండిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేశారు. ఇక మృతురాలు అతడి భార్య కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#Mumbai: A man, in his 30s, threw his sleeping wife in front of a speeding long distance train at #Vasai railway station and fled with his two minor children on Monday morning. Search launched for him.#Viral #viralvideo #Maharashtra pic.twitter.com/w0IyvmdNnx
— Siraj Noorani (@sirajnoorani) August 23, 2022