ఈ రోజుల్లో కొందరు పెళ్లైన వక్తులు వివాహేతర సంబంధాల్లో వేలు పెడుతూ పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాల్లో పడి సొంత సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇక ఇంతటితో ఆగక.., హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త ప్రియురాలి కోసం కట్టుకున్న భార్యను కిరాయి మనుషులతో హత్య చేయించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ముంబాయిలో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ముంబాయిలో పన్వేల్ లో ప్రియాంక (30), దేవర్దన్ సింగ్ (33) అనే యువతి, యువకుడు సాఫ్ట్ వేర్ కొలువుల్లో స్థిరపడ్డారు. ఇక ఒకరికొకరు నచ్చుకోవడంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లైన కొంత కాలానికి ఈ దంపులకు ఓ కూతురు కూడా పుట్టింది. ఇలా వీరి సంసారం ఎంతో సంతోషంగా సాగుతున్న క్రమంలోనే భర్త దేవర్ధన్ సింగ్ జీవితంలోకి అతని మాజీ ప్రియురాలు నిఖిత ఎంట్రీ ఇచ్చింది. దీంతో దేవర్దన్ సింగ్ సైతం తన మాజీ ప్రియురాలితో సినిమాలకు, షికారులకు తిరుగుతూ మరోసారి ప్రేమలోపడ్డాడు.
ఇక ప్రియురాలి మోజులో పడ్డ దేవర్దన్ సింగ్ అందమైన భార్యను వదిలేసి నిఖితతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇలా రోజులు గడుస్తున్న క్రమంలో భార్య ప్రియాంకకు భర్త సాగిస్తున్న చీకటి వ్యవహారం తెలిసి పోయింది. దీంతో కోపంతో ఊగిపోయిన ప్రియాంక.., భర్త ప్రియురాలు అయిన నిఖితకు వార్నింగ్ ఇచ్చింది. ప్రియుడి భార్య వార్నింగ్ ఇవ్వడంతో నిఖిత తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నిఖిత తన ప్రియుడికి చెప్పి స్వప్నను ప్రాణాలతో లేకుండా చేయాలని కబురు పంపింది. ప్రియురాలు కోరికను కాదనని ప్రియుడు దేవర్దన్ సింగ్ ఓకే చెప్పడంతో ఇద్దరు స్వప్న హత్యకు ప్లాన్ గీశారు.
స్వప్న హత్యలో భాగంగానే వీళ్లిద్దరూ కిరాయి మనుషులకు రూ. 3 లక్షలు ఇచ్చి ఎట్టకేలకు స్వప్నను దారుణంగా హత్య చేయించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే భార్యను హత్య చేయించిన భర్త దేవర్దన్ సింగ్ ఈ తప్పు నుంచి తప్పించుకునేందుకు ఎన్నో ప్రయత్నం చేశాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో మాత్రం స్వప్నను హత్య చేసింది భర్త దేవర్దన్ సింగ్, అతని ప్రియురాలు నిఖిత అనే తేలింది. దీంతో పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.