Mulugu Love Couple: పెళ్లైన వ్యక్తితో ఓ యువతి ప్రేమ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పెద్దలు తమ ప్రేమను అంగీకరించటం లేదన్న బాధతో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ములుగు మండలంలోని మామిడ్యాలకు చెందిన గొట్టి మహేష్కు ఏడేళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణితో పెళ్లయింది. మహేష్ ఆటో నడపటంతో పాటు అప్పుడప్పుడు కూలీ పనులకు కూడా వెళ్తుండేవాడు. ఈ నేపథ్యంలోనే మార్కూర్కు చెందిన పదిరి స్వప్నతో పరిచయం ఏర్పడింది.
కొన్ని రోజులకే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అయితే, మహేష్కు ఇదివరకే పెళ్లయి ఉండంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమను హర్షించలేదు. దీంతో వీరు గతేడాది ఇంటినుంచి పారి పోయారు. పెళ్లి చేసుకోవాలని చూశారు. కానీ, పోలీసులు వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపేశారు. ఆరు నెలలు ఎవరికి వారు దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాతి నుంచి మళ్లీ కలిసి తిరగటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ శుక్రవారం ఇంటినుంచి మరోసారి పారిపోయారు. శనివారం తెల్లవారుజామున కొండపోచమ్మ సాగర్ జలాశయం సమీపంలోని అడవి మజీద్ అటవీ ప్రాంతంలోకి వెళ్లారు.
మేనమామ నవీన్కు మహేష్ వాట్సాప్లో లోకేషన్ పంపాడు. నవీన్, మహేష్ తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇచ్చాడు. వాళ్లు అక్కడికి వెళ్లి వెతగ్గా మహేష్, స్వప్న విగతజీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : పిల్లాడ్ని కిడ్నాప్ చేసి రూ. 20 కోట్లు డిమాండ్.. తల్లిదండ్రులు ఆ ట్విస్ట్ ఊహించలేదు..