Mother: తల్లి అనే పదానికే కలంకం తెచ్చిందో మహిళ. రెండు పెళ్లిళ్లు చేసుకుని, కన్న ప్రేమను ఏడారిలో వదిలేసింది. బిడ్డ కడుపులో ఉండగానే అమ్మేసింది. వచ్చిన డబ్బులతో ఇంట్లో సామాన్లు కొనుక్కుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్లోని ఇండోర్, గౌరీ నగర్కు చెందిన విశాల్, షైనా బి భార్యాభర్తలు. షైనాకిది రెండో వివాహం. గతంలోనే ఆమెకు పెళ్లయి, విడాకులు కూడా తీసుకుంది. రెండో పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకు షైనా గర్భవతి అని తెలిసింది. అయితే, పుట్టే బిడ్డ తనకు కాకుండా.. మొదటి భర్తకు చెందుతాడని ఆమె భావించింది.
అందుకే పుట్టబోయే బిడ్డని అమ్మాలనుకుంది. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనర్ సహాయం తీసుకుంది. ఇంటి ఓనర్ నేహ సూర్యవంశీ.. షైనాను పూజా వర్మ, నేహా వర్మ, నీలం వర్మ అనే మధ్య వర్తుల దగ్గరకు తీసుకెళ్లింది. వారందరూ కలిసి కడుపులో ఉన్న బిడ్డను దివాస్ జిల్లాకు చెందిన లీనా అనే మహిళకు అమ్మేశారు. మొత్తం 5.50 లక్షల రూపాయలకు బేరం అయింది. ఆసుపత్రిలో బిడ్డ పుట్టిన 15 రోజులకే బాబును వారికి అప్పగించింది. మధ్య వర్తుల ఛార్జీలు పోను షైనా చేతికి 2లక్షల 70వేలు ముట్టాయి.షైనా ఇంటికి వచ్చేసింది. బిడ్డకు దూరమైన బాధ ఏమాత్రం లేకుండా.. ఆ వచ్చిన డబ్బులతో జల్సాలు మొదలుపెట్టింది. ఇంట్లోకి టీవీ, ప్రిడ్జ్, కూలర్ వాషింగ్ మిషన్, భర్తకు ఓ బైకు ఇలా అన్నీ కొనేసింది. ఈ ఘటనపై ఓ సోషల్ వర్కర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బిడ్డ అమ్మకంలో పాల్గొన్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. బిడ్డను జాగ్రత్తగా స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న షైనా భర్త కోసం గాలిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Wife: భార్య ఉద్యోగం చేయకూడదని చెయ్యి నరికాడు.. తగ్గేదేలే అంటున్న భార్య!