ఇతని పేరు రాకేశ్ రెడ్డి. వయసు 21 ఏళ్లు. చదువులో బాగా రాణించే కొడుకు ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్ రాశాడు. అందులో ఏముందో తెలుసా?
గత కొన్ని రోజుల నుంచి విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువులో రాణించలేకపోతున్నానని, ప్రేమ విఫలమైందని ఇలా ఏవేవో కారణాలు సూసైడ్ నోట్ లో రాసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ బీటెక్ స్టూడెంట్ తన ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు కుమారుడు రాసిన సూసైడ్ నోట్ చదివిన తండ్రి, అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ సూసైడ్ నోట్ లో ఏముందంటే?
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా కీసర పరిధిలో ఉన్న కరీంగూడలో ఆకాష్ రెడ్డి (21) అనే యువకుడు కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటున్నాడు. ఇతడు చీర్యాలలో ఉన్న ఓ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ చదువుతున్నాడు. అయితే చదువుల్లో చురుగ్గా ఉండే ఆకాష్ ఉన్నట్టుండి ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?.. మిస్ యూ నాన్న, మై డాడ్ హీరో, అక్కను బాగా చూసుకో, నువ్వు మంచిగా ఉండు. నాకు ఇక్కడ ఉండే ఇష్టం లేక చనిపోతున్నాను. నా చావుకి నేనే కారణం అంటూ.. సూసైడ్ లెటర్ రాసి ఆ యువకుడు ఇంట్లో గురువారం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న తండ్రి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం రాకేష్ రెడ్డి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు రాకేశ్ రెడ్డి మృతదేహాన్ని అప్పగించారు. చేతికందిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.