ఈ మధ్యకాలంలో అక్రమసంబంధాలే సాఫీగా సాగుతున్న వైవాహిక జీవితాలను రోడ్డున పడేస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త ఇలా ఒకిరికి తెలియకుండా మరొకరు రంకుపురాణంలో వేలుపెడుతున్నారు. ఇలా ఎన్నో కుటుంబాలు వివాహేతర సంబంధాల వల్ల వారి జీవితాలు ఎటు కాకుండా పోతున్నాయి. ఇక ఇలాంటి ఘటనే నిజమాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి మండలం వెస్లీనగర్ తండాలో ఓ యువతికి ఈ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది.
ఇక భర్త వృత్తిరీత్యా ఇంటికి దూరంగా ఉంటుండటంతో భార్య కొంత కాలం పద్దతిగానే మెలిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ వివాహితకు అదే గ్రామానికి చెందిన బాధావత్ పీర్ సింగ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లకి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఒకరినొకరు శారీరకంగా కూడా కలుసుకుంటున్నారు. ఈ విషయం కాస్త సొంత మరిది చెవిలో పడింది. దీంతో ఓ రోజు మరిది కళ్లేదుటే వదిన మరొకడితో బెడ్ రూంలో అడ్డంగా దొరికింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన మరిది గొడ్డలితో బాధావత్ పీర్ సింగ్ తలపై బాదాడు. దీంతో రక్తపు మడుగులో పడి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక విషయం తెలుసున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్ కు తరలించారు.