నేటి సమాజంలో కొందరు మనుషులు ఎంత దారుణంగా ఉన్నారంటే.. తమ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారని మరచి ఇతర మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేటి సమాజంలో ప్రతి చోట మహిళల మాన, ప్రాణాలకు రక్షణలేకుండా పోయింది. చివరికి పవిత్రమైన దేవాలయాల్లోనూ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. దానికి నిదర్శనంగా తాజాగా సంఘటన. దైవ దర్శనానికి వచ్చిన మహిళల పట్ల ఓ యువకుడు దారుణంగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు ఆ యువకుడిని పట్టుకోని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
వివరాల్లోకి వెళ్తే… అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కొందరు భక్తులు కర్నూలు జిల్లా మహానందిలో మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చారు. ఆ భక్తుల్లోని కొందరు మహిళలు బహిర్భూమి కోసం ఆలయం వెనుకాల ఉండే నిర్మానుష ప్రాంతానికి వెళ్లారు. దేవస్థానం పరిధిలోని మరుగుదొడ్డిలో పనిచేసే ఓ యువకుడు వారు వెళ్లడాన్ని గమనించాడు. బహిర్భూమికి వెళ్లిన మహిళలను ఫోటోలు తీశాడు. ఆ యువకుడిని గమనించిన మహిళలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు.
అనంతరం పోలీసులకు సమచారం అందించారు.. వారు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. తర్వాత ఆ మహిళ భక్తులు స్టేషన్కు వెళ్లి మరుగుదొడ్లు నిర్వహించే వ్యక్తులను పిలిపించాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చి వారు క్షమాపణలు చెప్పడంతో పాటు ఫొటోలు డిలీట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఆదివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేటి కాలంలో ఆడవారికి భద్రత లేకుండా పోతుంది. ఇలాంటి కీచకుల వల్ల పవిత్రమైన దేవస్థానంలో కూడా మహిళలకు భద్రత లేకుండా పోతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.