మారుతున్న పోటీ ప్రపంచంలో టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే ఇంకా నేటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు పదిలంగానే ఉన్నాయి. ఇలాంటి విశ్వాసాల్లో పడి అనేక మంది అమాయక ప్రజలు దేనికైనా తెగిస్తున్నారు. ఇలాంటి మూడ నమ్మకాలను నమ్మిన ఓ యువతి ఏకంగా తన నాలుకను కోసుకుని అమ్మవారికి బలిగా ఇచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక… మధ్య ప్రదేశ్ లోని బడా ప్రాంతానికి చెందిన రాజ్ కుమారీ(20) అనే యువతి తల్లిదండ్రులతో పాటే నివాసం ఉంటోంది. అయితే ఇటీవల తన అమ్మానాన్నలతో కలిసి కుమారీ అమ్మవారి దేవాలయానికి వెళ్లింది. ఈ యువతికి మూడ విశ్వాసం ఎక్కువగా ఉండడంతో అమ్మవారికి బలి ఇస్తే మంచి జరుగుతుంది అనుకుంది. ఇందులో భాగంగానే.. నేను కూడా బలి ఇస్తే బాగుండు అనుకుంది.
ఇది కూడా చదవండి: Madhya pradesh: బుల్డోజర్ పై ఊరేగింపులో వచ్చిన వరుడు.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు!