ఎన్ని అవగాహన కార్యక్రమాలు, ఎన్నెన్ని ప్రాచారాలు చేసినా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించి జనాలు వాహనంలో ఉండటం ఇలా కారణం ఏదైనా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలికావాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.
ఒకరి నిర్లక్షం ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. రాంగ్ రూట్లో వచ్చిన లారీ.. స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టింది. స్కూల్ కి వెళ్లొస్తామంటూ వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. మధ్యప్రదేశ్లో జరిగిన ఈ ఘటన అందరినీ కలచి వేసింది. నగ్దా- ఉన్హేల్ రహదారి వద్ద రాంగ్ రూట్లో వచ్చిన లారీ స్కూల్ వ్యానును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో నలుగురు చిన్నారులు మృతి చెందగా మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Four children died and eight injured in a road accident at Nagda, near Ujjain, MP. #BREAKING #BreakingNewsIndia pic.twitter.com/Lm5xw0E7A9
— Ravindra Bhajni (@ravibhajni) August 22, 2022
నగ్దాలోని ఫాతిమా కాన్వెంట్కు విద్యార్థులను తీసుకెళ్తున్న వ్యాన్ను ఉన్హెల్లోని జిర్నియా ఫాటా సమీపంలో ఓ లారీ ఢీకొట్టింది. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో స్థానికులే పిల్లల్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతులు భవ్యాంశ్(16), సుమిత్(18), ఉమ(15), ఇనయ(6)గా గుర్తించారు. మరో 11 మందికి గాయాలు కూడా అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉండటంటో ఇండోర్లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
मध्यप्रदेश के उज्जैन जिले के नागदा में ट्रक ने स्कूली बच्चों की वैन को टक्कर मारी। चार बच्चों की मौत हो गई। कई घायल हैं। #Ujjain #SchoolBus #Accident #MadhyaPradesh #MPNews https://t.co/VMEraymHFH pic.twitter.com/hqyvQpgV7e
— Amar Ujala (@AmarUjalaNews) August 22, 2022
उज्जैन में भीषण सड़क हादसा: स्कूली बच्चों से भरी गाड़ी को ट्रक ने टक्कर मारी; हादसे में 4 बच्चों की मौत, 8 गंभीर रूप से घायल #MadhyaPradesh #ujjain #accident https://t.co/DpHJldkDLi pic.twitter.com/51pojdqsR0
— Dainik Bhaskar (@DainikBhaskar) August 22, 2022