ప్రకాశం జిల్లా గిద్దలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న భర్తపై భార్య రోకలిబండతో దాడి చేయడమే కాకుండా ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా గిద్దలూరులోని శ్రీరామ్ నగర్లో ఈ ఘటన జరిగింది. భార్యే.. భర్తను దారుణంగా హతమార్చింది. రోకలి బండతో దాడి చేయడమే కాకుండా పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. తరచూ మద్యం తాగొచ్చి వేధింపులకు గురి చేస్తుండటంతో విసిగిపోయిన తాను ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు తెలిపింది.
ఇది కూడా చదవండి : సోషల్ మీడియాలో భార్య అసభ్యకర వీడియోలు.. భర్త ఏం చేశాడంటే..?
గిద్దలూరుకు చెందిన అంకాలమ్మ, అంజి(చిరంజీవి)కి 10 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు. మొదట్లో బాగానే ఉన్న అంజి, తర్వాత తరచూ మద్యంతాగడమే కాకుండా నిత్యం భార్యను వేధించేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగొచ్చి భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన అంకాలమ్మ, రోకలిబండతో దాడి చేసి, అనంతరం తీవ్రంగా గాయపడ్డ భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో అంజి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.