పెళ్లి.. ప్రతి మనిషి జీవితంలో ముఖ్య ఘట్టం. వివాహ బంధం గురుంచి మగవారి కన్నా మహిళే ఎక్కువ ఆలోచిస్తుంది. ఎందుకంటే వివాహం తర్వాత ఆమె తన కుంటుంబాన్ని, సొంత ఊరిని సైతం వదిలి.. కొత్త కుటుంబంలోకి వెళ్తుంది. అలా వెళ్లిన చోట పుట్టింట్లో దొరికిన ఆప్యాయత మెట్టినింట్లో కూడా దొరికితే ఆ బంధం సాజావుగా సాగిపోతుంది. అలా కాకుండా భార్యని ఓ బానిసలా చూసే భర్త.. కోడలంటే.. ఏటీఎం మెషిన్ లా భావించే అత్తింటి వారు లభిస్తే.. ఆ మహిళ నిత్యం నరకం చవిచూడాల్సిందే. ఇవి చాలవన్నట్లు..
ఈ మధ్య కాలంలో భర్తలు.. భార్యలపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. కాదంటే.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భర్త వికృత చేష్టలను భరించలేక పోలీసులను ఆశ్రయించింది ఓ మహిళ. తన భర్త, అత్తమామల నుంచి కాపాడాలని కోరింది.
ఇది కూడా చదవండి : టీచర్ల మధ్య ఎఫైర్! లాడ్జ్ లో అడ్డం తిరిగిన అసలు కథ!
ఆ వివరాలు.. కొత్వాలి పరిధిలోని అరిహంత్ లో నివసించే పూజ అనే మహిళకు 2019 లో సూరజ్ జైన్ అనే వ్యక్తితో వివాహమైంది. ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన పూజకి ఆశలన్ని అడియాశలు అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. పెళ్లైన కొద్దిరోజులకే భర్త తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు.. అదనపు కట్నం కోసం పూజను చిత్ర హింసలు పెట్టేవాడు. కొడుకు తప్పు చేస్తే దండించాల్సిన తల్లిదండ్రులు కొడుకుకు వత్తసు పలుకుతూ మరింత హింసించేవారు. అదనపు కట్నం తీసుకురాలేదని పూజకు ఇష్టం లేకుండా రెండు సార్లు అబార్షన్ చేయించారు. నిత్యం కొడుతూ తొడల మధ్య వాతలు పెట్టేవారు. బయట ఎవరికి చూపించుకోలేని ప్రదేశాల్లో వాతలు పెట్టి నరకం చూపించారు. మూడేళ్లపాటు ఈ కష్టాలను భరించిన పూజ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించింది. భర్త, అత్తామామామలపై కేసు పెట్టింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.