భర్త తన మాట వింటాడని, తను చెప్పినట్లుగా ఉండి నా కోరిక తీరుస్తాడని భార్య ఎన్నో ఆశలు పెట్టుకుంది. అలా ఒకటి కాదు రెండు కాదు గత మూడేళ్ల నుంచి చెబుతూనే ఉంది. కానీ భర్త దానికి బానిసై భార్యను పట్టించుకోవడం లేదు. భర్త అలా ప్రవర్తించడంతో భార్య తీవ్ర మనస్థాపానికి లోనైంది. ఏం చేయాలో అర్థం కాక ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. అసలు ఆమె ఏం నిర్ణయం తీసుకుంది? ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది హైదరాబాద్ కుషాయిగూడలోని చక్రీపురం. ఇదే ప్రాంతంలో ఎర్రంశెట్టి సుష్మ(36), శ్రీమన్నారాయణ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి అశోక్ భరద్వాజ్(9) అర్జున్ (3) అనే కుమారులు ఉన్నారు.
కాగా భర్త సాఫ్ట్ వేర్ రంగంలో హెచ్ఆర్ మేనేజర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించాడు. అయితే కోవిడ్ సమయంలో శ్రీమన్నారాయణ ఉద్యోగం పోవడంతో అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటున్నాడు. భర్త జాబ్ పోవడంతో వారి కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే శ్రీమన్నారాయణ తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఇక రోజు మద్యానికి అలవాటు పడి రోజూ తాగేవాడు. అలా కొన్నాళ్లకి తాగుడుకు డబ్బులు లేకపోవడంతో ఏకంగా ఇంట్లోని విలువైన వస్తువులను సైతం అమ్మి మద్యం తాగేవాడు. మద్యం తాగొద్దని భార్య ఎన్నో సార్లు చెప్పి చూసింది. అయినా భర్త తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు.
భర్త తాగుడు బానేస్తే తన కుటుంబం సంతోషంగా ఉంటుందనే ఆమె కోరికను భర్త నెరవేర్చలేకపోయాడు. దీంతో పాటు గత కొన్ని రోజుల కిందట భర్త ఇంట్లో నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో ఖంగారు పడ్డ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాలింపు చర్యలు చేపట్టగా చివరికి దిల్ సుఖనగర్ లోని ఓ లాడ్జీలో దొరికాడు. ఇలా అయితే జీవితం ఎలా అని భార్య భర్తను చెప్పి చూసింది. ఇంత జరిగినా కూడా శ్రీమన్నారాయణ మందు తాగడం మాత్రం మానడం లేదు. ఇక విసిగిపోయిన సుష్మ బాధపడుతూ ఉండేది.
భర్త ప్రవర్తనతో కలత చెందిన భార్య ఇటీవల ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఆమె కుమారుడు అశోక్ ఇంటి వచ్చాడు. ఇంట్లో చీరకు వేలాడుతూ తల్లి కనిపించడంతో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఈ విషయం వారి కుటుంబ సభ్యులకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త శ్రీమన్నారాయణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.