నేటి కాలంలో కొందరు మహిళలు భర్తతో ఎంచక్క కాపురం చేయాల్సింది పోయి ప్రియుడితో వివాహేతర సంబంధానికి తెర తీస్తున్నారు. ఇటీవల భర్తను కాదని ప్రియుడితో జతకట్టిన ఓ మహిళకు అదే ప్రియుడు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఇదే కాకుండా ప్రియురాలిని చంపేందుకు కూడా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది కృష్ణాజిల్లా గుడివాడలోని బాపుజీనగర్. ఇదే ప్రాంతానికి చెందిన అనూష అనే మహిళకు పెళ్లై ఇద్దరు కుమారులు ఉన్నారు.
దాదాపు చాలా ఏళ్ల పాటే ఈ దంపతుల కాపురం సాఫీగా సాగింది. కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.., గత కొంత కాలం నుంచి భర్త రాజమండ్రిలో ఉంటుండగా, కుమారుడు తిరుపతిలో ఉంటున్నాడు. అనూష మాత్రం బాపుజీనగర్ లో ఒంటరిగానే ఉంటుంది. ఈ క్రమంలోనే అనూషకు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయమే చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ప్రియుడు వెంకటేశ్వర్లు ప్రియురాలైన అనూషను హత్య చేసేందుకు పథకం వేశాడట. ఇందులో భాగంగానే ఇటీవల జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో అనూష తీవ్ర గాయాల పాలైంది.
వెంటనే స్పందించిన స్థానికులు అనూషను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించిన అనూష కమారులు.., వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నా తల్లిని చంపేందుకు ప్లాన్ వేశాడని, అతని నుంచి మమ్మల్నీ రక్షించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక వీరి వాదన ఇలా ఉంటే.., తల్లి వాదన మాత్రం.. పెంపుడు కుక్క గోమార్లను ఓ డబ్బాలో వేసి తగలబెడుతుంటే అనుకోని ప్రమాదంలో నాకు మంటలు అంటుకున్నాయని అనూష చెబుతోంది. వెంకటేశ్వర్లు చంపేస్తానని బయపెట్టిన కారణంగానే మా తల్లి అలా చెబుతుందని అనూష ఇద్దరు కుమారులు వాపోతున్నారు. అనూష కుమారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.