ఇంటి నుంచి వెళ్ళిన అమ్మాయి క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. సాంకేతికరంగ అభివృద్ధి సమాజానికి ఎంత మేలు చేస్తుందో అంతే విచ్ఛిన్నం కలిగిస్తోంది. టెక్నాలజీని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే దుష్పరిణామాల్లో మహిళలపై లైంగిక దాడులు కూడా ఒకటి. నియంత్రణ లేని అశ్లీల సాహిత్యం, అసభ్యకర దృశ్యాలు స్త్రీలపై లైంగిక దాడులకు, అత్యాచారాలకు పాల్పడేలా పురికొల్పుతున్నట్లు అనేక కేసుల్లో వెల్లడైంది. మహిళల భద్రతకు మాత్రం హామీ లభించట్లేదు. దేశంలో రోజు రోజుకూ మహిళలపై పెరిగిపోతున్న అకృత్యాలు, అత్యాచారాలు, నిర్భయ లాంటి ఘటనలు, కొత్త చట్టాల నేపథ్యంలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో …
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడికి కఠిన శిక్ష విధిస్తూ కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ తీర్పు వెల్లడించారు. నిందితుడు సునీల్కుమార్కు 21 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.11 వేల జరిమానా విధించారు. దొడ్డా సునీల్కుమార్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు. గతేడాది కరోనా ప్రభావంతో పాఠశాలలు మూతపడిన సమయంలో చదువు పేరిట కొందరు బాలికలను తరచూ పాఠశాలకు రప్పించేవాడు. అతడు తమపై లైంగికదాడికి పాల్పడినట్లు అయిదుగురు బాలికలు తల్లిదండ్రులకు చెప్పారు.
తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఎస్సై అంజయ్య మరుసటి రోజు పోక్సో కేసు నమోదు చేసి నిందితుణ్ని అరెస్టు చేశారు. తాజాగా నిన్న ఈ కేసును విచారించిన కొత్తగూడెంలోని పోక్సో ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ నిందితుడు సునీల్ కుమార్ను దోషిగా తేల్చి శిక్ష విధించారు. 21 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ. 11 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.