నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు, దాని కారణంగా చోటు చేసుకుంటున్న నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆడా, మగా అనే తేడా లేకుండా.. క్షణిక సుఖం కోసం.. కుటుంబం, పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. తాజాగా ఈ కోవకు చెందని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. వావి వరుసలు మరిచి వరుసకు బాబాయి అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ అతడి సాయంతో కట్టుకున్న భర్తనే హతమార్చిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగుచూసింది. చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం.. తాగొచ్చి రోజూ చిత్రహింసలు పెడుతున్నందున భరించలేకే భర్తను హత్య చేసినట్లు పోలీసుల ముందు కట్టుకథలు చెప్పింది. అయితే విచారణలో అసలు నిజం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.
వైరా సీఐ వసంత్కుమార్ కథనం మేరకు… తల్లాడ మండలం కుర్నవల్లి దళితకాలనీలో జయరాజు, నిరోష దంపతులు నివాసముంటున్నారు. కొంతకాలంగా నిరోష వరుసకు బాబాయి అయ్యే కల్లూరు మండలం చిన్నకోరుకొండికి చెందిన మాడుగుల కృష్ణతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. చుట్టరికం ఉండటం, వరసకు బాబాయి కావడంతో కృష్ణ తరుచూ వారింటికి వచ్చేవాడు. జయరాజు బయటికి వెళ్లిన సమయంలో నిరోషతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని జయరాజు నిర్ధారించుకున్నాడు. ఇద్దరినిన రెడ్హ్యాండెడ్గా పట్టుకోవాలని భావించి.. ఓ ప్లాన్ వేశాడు. నెల 26న జయరాజు మద్యం మత్తులో ఇంటికి వచ్చి పడుకోగా నిరోష ప్రియుడికి కబురు పెట్టింది. ఇద్దరూ రాసలీలల్లో మునిగితేలుతున్న సమయంలో జయరాత్రి మేల్కోని వారిద్దరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు.
ఈ విషయం బయటకు తెలిస్తే తమ పరువు పోతుందని భావించిన నిరోష, కృష్ణతో కలసి జయరాజును రోకలి బండతో కొట్టి చంపేశారు. అనంతరం నిరోష పోలీసులకు కబురు పెట్టింది. భర్త తాగొచ్చి వేధింపులకు గురిచేస్తుండటంతోనే తట్టుకోలేక హత్య చేసినట్లు వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆమె ప్రవర్తనపై అనుమానం కలిగిన పోలీసులు లోతుగా విచారణ చేపట్టగా ఆమె అక్రమ సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో నిరోష, కృష్ణలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నోరు విప్పారు. పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి శనివారం మధిర కోర్డులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో సబ్జైలుకు తరలించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.