ఈ మద్య పలు స్కూల్స్, కాలేజీల్లో టీచర్లు ర్యాంకులు రావాలని విద్యార్థులను కఠినంగా శిక్షిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే పనిష్ మెంట్స్ చాలా దారుణంగా ఉంటున్నాయి.. కొన్నిసార్లు విద్యార్థులు ప్రాణాలు కూడ కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి.
ఇటీవల పలు స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులను టీచర్లు దారుణంగా హింసించడం.. దాడులు చేయడం చూస్తూనే ఉన్నాం. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా చిత్ర హింసలకు గురి చేయడం .. ఆ సమయంలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ మద్యనే విశాకలో చిన్న పిల్లలను షూ విప్పించి ఎండలో నిలబెట్టిన ఘటన కలకలం చేపింది. తాజాగా ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో 3వ తరగతి చదువుతున్న చిన్నాకి మృతి కలకలం చేపుతుంది. వివరాల్లోకి వెళితే..
వికారాబాద్ జిల్లా పూడురు మండలం చిలాపూర్ లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ లో 3వ తరగతి చదువుతున్న కార్తీక్ ని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో ఆ బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కార్తీక్ తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. తమ కొడుకుని టీచర్ దారుణంగా కొట్టడం వల్లనే అస్వస్థతకు గురయ్యాడుని.. అతనిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు స్కూల్ యాజమాన్యం మాత్రం కార్తీక్ కిందపడటం వల్ల ప్రమాదం జరిగిందని అంటున్నారు.