పైన ఫొటోలో కనిపిస్తు విళ్లిద్దరూ తల్లీకూతుళ్లు. చూడటానికి ఎంతో అమాయకంగా కనిపిస్తున్నా.. వీరు చేసిన నేరం వింటే మీరు అస్సలు నమ్మలేరు. అవును మీరు విన్నది నిజమే. ఎంతో గుట్టుగా ఇన్నాళ్లు సాగించిన వీరి నకిలీ దందా వ్యవహారం ఎట్టకేలకు బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వీరి వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు వీరు చేసిన నేరం ఏంటి? ఎలాంటి దారుణానికి పాల్పడ్డారనే పూర్తి వివరాలు తెలియాలంటే తప్పకుండా ఈ స్టోరీ చదవాల్సిందే. అది కేరళ కొట్టాయం పరిధిలోని అళప్పుళా అంబాలపూళి ప్రాంతం. ఇక్కడే విలాసినీ (68), ఏళ్ల షీబా (34 ) తల్లీకూతళ్లు నివాసం ఉంటున్నారు.
చూడటానికి అమాయకంగా కనిపిస్తున్న వీళ్లిద్దరూ ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డారు. వీరు చేస్తున్న నేరాన్ని అస్సలు బయటకు పొక్కకుండా ఎంతో జాగ్రత్త పడ్డారు. అసలు వీరు చేసిందేంటనేది కదా మీ ప్రశ్న? వీరిద్దరూ ఎంతో చాకచక్యంగా టెక్నాలజీని ఉపయోగిస్తూ.. నకిలీ నోట్ల తయారీకి శ్రీకారం చుట్టారు. గత కొంత కాలం సాగిస్తున్న వీరు కొన్ని రూ. 100, 500 నోట్లను ముద్రించారు. అలా ముద్రించిన నోట్లతో లాటరీలు కొంటున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల విలాసినీ తన వద్ద నున్న నకిలీ నోట్లను తీసుకుని ఓ షాపు వద్దకు వెళ్లింది. ఆ నోట్లను చూసిన షాప్ యజమానికి కాస్త అనుమానం వచ్చింది. ఇక ఆ మహిళకు అస్సలు అనుమానం రాకుండా పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే సైలెంట్ గా అక్కడికి వచ్చిన పోలీసులు ఆ మహిళను ప్రశ్నించారు. ఆమె వద్ద నున్న నకిలీ నట్లను చూసి పోలీసులు ఒక్కసారిగా బిత్తరపోయారు. నాకేం సంబంధం లేదని, ఇదంతా నా కూతురే పనేనంటూ పెదవి విరిచింది. వెంటనే పోలీసులు ఆ మహిళ ఉంటున్న ఇంటికి చేరుకుని తలుపు తెరిచి చూడగా ఆ మహిళ కూతురు షీబా ఇంట్లో కనిపించింది. పోలీసులను చూసి ఆ యువతి ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇంట్లో అన్నీ పరిశీలించగా.. ఓ ల్యాప్ టాప్, ప్రింటర్, 31.. 500 నోట్లు, 7 రూ.200 నోట్లు, కొన్ని 100, 10 నకిలీ నోట్లను కనిపించాయి. వీటన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులు ఆ తల్లీకూతుళ్ల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ తల్లీకూతుళ్ల నకిలీ దందా ఎట్టకేలకు బయటపడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.