కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. ఎదురింటి మైనర్ బాలికపై కన్నేసిన ఓ యువకుడు మాయమాటలు వల్లించి శారీరకంగా కోరికలు తీర్చుకున్నాడు. ఇక ఇంతటితో ఆగకుండా.. మతం మార్చుకోవాలంటూ టార్చర్ పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ క్రైమ్ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మండ్య జిల్లా నాగమంగల తాలుకాలో 13 ఏళ్ల మైనర్ బాలిక స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఇక వీరి ఎదురింట్లో యూనస్ పాషా అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పాషా ఎదురింట్లో ఉంటున్న ఆ మైనర్ బాలికపై కన్నేశాడు. ఎలాగైన ఆ బాలికతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇక ఇందులో భాగంగానే ఆ బాలికకు నువ్వు వికలాంగురాలువని, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటూ ఎన్నో మాయ మాటలు వళ్లించాడు.
ఇదంతా నిజమేనని నమ్మిన ఆ బాలిక అతనితో శారీరకంగా గడిపింది. అలా కొన్నాళ్ల పాటు పాషా ఆ బాలికతో ఎంజాయ్ చేస్తూ వచ్చాడు. అయితే ఈ క్రమంలోనే పాషా ఇటీవల ఆ బాలిక తల్లిదండ్రులు పక్క ఊరికి వెళ్లారు. ఆ బాలి్ను ఇంట్లో కలుసుకునేందుకు వారి బామ్మ అడ్డుగా ఉందని తెలుసుకున్నాడు. దీంతో పాషా ఆ బాలికకు మీ బామ్మకు సాంబర్ లో నిద్రమాత్రలు కలిపి ఇవ్వు అంటూ సలహా ఇచ్చాడు. అతడు చెప్పినట్లే ఆ బాలిక చేయడంతో పాషా అర్థరాత్రి ఆ బాలిక ఇంట్లోకి దూరిపోయాడు.
అనంతరం ఆ బాలికతో ఎంజాయ్ చేస్తూ వీడియోలు తీసుకున్నాడు. అలా రెండు రోజులు గడిచిన తర్వాత పాషా ఆ బాలికతో నువ్వు మతం మారాలని, అలాగైతేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని, లేకుంటే చేసుకోనంటూ తేల్చి చెప్పాడు. ఇంతటితో ఆగకుండా ఎక్కువ మాట్లాడితే నీ వీడియోలు బయటపడతానంటూ కూడా పాషా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడు పాషాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.