కొట్టుకున్నా, తిట్టుకున్నా అన్ని అప్పటికే మరిచిపోయి సంతోషంగా కలిసి ఉండే వ్యక్తులే భార్యాభర్తలు. ఇలా కలకాలం పాటు నమ్మకంతో వైవాహిక బంధాన్ని కొనసాగించాల్సిన ఓ భర్త భార్యకు నమ్మక ద్రోహం చేశాడు. ఏకంగా ఎవరూ ఊహించని రీతిలో అఘాయిత్యానికి పాల్పడి భార్యను దారుణంగా హత్య చేశాడు. 11 ఏళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసు అసలు నిజాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది కర్ణాటక రాష్ట్రం విజయపురి జిల్లా వాదావేణు పరిధిలోని ముదుదేహల్.
ఇదే గ్రామానికి చెందిన ఉచ్చప్ప, ప్రియాంక భార్యాభర్తలు. పెళ్లైన నాటి నుంచి వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. అయితే ఉచ్చప్ప గత కొన్ని రోజుల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ప్రియాంక మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుందని అనుకున్నాడు. దీంతో ఉచ్చప్ప భార్యపై పగ పెంచుకున్నాడు. ఎలాగైన ప్రియాంకను చంపాలనే పథకం వేశాడు. ఇందులో భాగంగానే ఉచ్చప్ప తన సోదరుడిని వెంటబెట్టుకుని తన భార్యతో పాటు శ్రీశైలం వెళ్లారు.
ఇది కూడా చదవండి: రెండు రాష్ట్రాల పోలీసులకు చెమటలు పట్టించిన యువతి.. కారణం ఏంటంటే?