కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పేట మున్సిపల్ కోర్టు మెజిస్ట్రీట్ అనిత తల్లిని వదిలేసి కుమారులకు, ఓ కూతురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా ఎల్లారెడ్డి పేట కోర్టు ముందు పాకుకుంటున్న వెళ్తున్న 80 ఏళ్ల వృద్ధురాలైన బాలాబాయిని ఆమె అక్కున చేర్చుకున్నారు. కారు దిగి ఆ వృద్ధురాలిని తన సొంత వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి హెల్త్ చెకప్ కూడా చేయించారు.
దీంతో పాటు అనిత ఆ వృద్ధురాలి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఇద్దరు కుమారులు, ఓ కూతురిని ఏకంగా కోర్టుకు రప్పించుకుని వారికి కౌన్సిలింగ్ తో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మెజిస్ట్రీట్ అనిత. ఇది మొదటి సారి కావటంతో వదిలేస్తున్నామని ఇలాంటి పరిణామాలు మళ్లీ పునరావృతం అయితే చట్ట రిత్యా కఠిన శిక్షలు తీసుకుంటామని అనిత తీవ్రంగా హెచ్చరించి ఇంటికి పంపించారు. ఇక తాజాగా జరిగిన ఘటన పట్ల స్పందించిన మెజిస్ట్రీట్ అనితపై పలువురు అధికారులు ప్రశంసిస్తున్నారు. ఇక ఇలా మానవతా దృక్పథంతో స్పందించిన మెజిస్ట్రీట్ అనితపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.