Crime News: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి మైనర్లయిన ఐదుగురు నిందితులు ప్రస్తుతం జువైనల్ హోమ్లో ఉన్న సంగతి తెలిసిందే. జువైనల్ హోమ్లో ఉన్న ఐదుగురు ఒకరిని ఒకరు కొట్టుకున్నట్లు సమాచారం. ప్లేట్లతో పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ కుమారుడే లక్ష్యంగా ఈ దాడి జరిగిటన్లు సమాచారం. అతడి కారణంగానే విషయం బయటకొచ్చిందని ఆరోపిస్తూ మిగిలిన వారు దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగిందని సమాచారం. కాగా, శనివారం నలుగురు నిందితులను పోలీసులు విచారించారు. A1 సాదుద్దీన్ మాలిక్తో పాటుగా ముగ్గురు మైనర్లను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో మైనర్లు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. లైంగిక దాడి కేసులో మైనర్లు తమ తప్పులేదని..
తమను సాదుద్దీన్ మాలికే రెచ్చగొట్టాడని.. ఆ తరువాతే లైంగిక దాడికి పాల్పడ్డామని పోలీసులకు తెలిపినట్లు సమాచారం. అయితే, సాదుద్దీన్ను విచారిస్తున్న క్రమంలో అతను.. ముందుగా మైనర్లే ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారని చెప్పారు. దీంతో ఏది నిజమో తెలియక పోలీసులు గందరగోళానికి లోనవుతున్నారు. బెంజ్ కారులో మొదట ఎమ్మెల్యే తనయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని, అనంతరం తాము అనుసరించామని స్టేట్ మెంట్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.కాన్స్ బేకరి నుండి మార్గం మధ్యలోనే ఎమ్మెల్యే కుమారుడు వెళ్లిపోయాడని, బెంజ్ కార్ కాన్స్ బేకరిలో పార్క్ చేసి ఇన్నోవాలో ఐదుగురం వెళ్ళామని స్టేట్ మెంట్ ఇచ్చారని వెల్లడించారు. ఘటన అనంతరం పోలీసులకు ఫిర్యాదు అందడంతో తామంతా ఎస్కేప్ అయ్యామని, ఎక్కడకు ఎస్కేప్ అవుతున్నాము అన్న విషయం ముందుగా డిసైడ్ కాలేదని చెప్పినట్లుగా పోలీసులు తెలిపారు. మరి, నిందితుల కొట్లాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Note On Wall: ఇంటి గోడపై సూసైడ్ నోట్.. ‘తమ్ముడూ.. వీళ్లంతా మంచోళ్లు కాదు!’