దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ద మహిళల వరకు కామాంధులు ఎవ్వరినీ వదలడం లేదు. ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. నిత్యం కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. తన ప్రేమను అంగీకరించలేదని ఓ దుర్మార్గుడు నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. చికిత్స పొందుతూ యువతి కన్నుమూసింది. ఈ దారుణమైన ఘటన ఝార్ఖండ్ లో జరిగింది.
ఇటీవల ఝార్ఖండ్ దుమ్కా లో అంకిత అనే యువతిని కొంత కలంగా షారూఖ్ హుసేన్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నా అంటూ వెంటపడసాగాడు. అతని ప్రేమను అంకీకరించలేదని అక్కసు పెంచుకొని ఆగస్ట్ 23 న వేకువజామున ఆమె ఇంట్లోకి ప్రవేశించిన పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ అంకితను రీమ్స్ కి తరలించారు. దాదాపు పూర్తిగా కాలిపోయిన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసింది.
అంకిత మరణంతో దుమ్కాలో తీవ్ర ఆందోళనలు చెలరేగాయి… నింధితుడిని పట్టుకొని కఠిన శిక్ష విధించాలని పెద్ద ఎత్తున గొడవలు మొదలయ్యాయి. దీంతో అక్కడ 144 సెక్షన్ సైతం విధించాల్సిన పరిస్థితి నెలకొంది. చనిపోయే ముందు అంకిత ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.