Chethabadi: హైదరాబాద్లోని పాతబస్తీ శ్మశానంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మహిళా ఎమ్మార్వో ఫొటో క్షుద్రపూజలు జరిగిన ప్రాంతలోని ఓ సమాధిపై ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఫొటోలోని మహిళా ఎమ్మార్వోపై చేతబడి జరిగిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం బార్కాస్లోని బడా ఖబ్రస్తాన్లోని బంధువు సమాధికి పూలు సమర్పించటానికి వెళ్లాడు. అక్కడ సమాధిపై క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించి షాక్ తిన్నాడు. వెంటనే పాతబస్తీ ఛత్రీనాకకు చెందిన చేతిబడి నిర్మూలన కర్తగా పేరొందిన జునైద్ బక్బాబీకి సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడకు వెళ్లిన జునైద్ సమాధిపై ఉన్న విచిత్ర వస్తువులున్న మూటను స్వాధీనం చేసుకున్నాడు. తనతో పాటు మూటను ఇంటికి తీసుకెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశాడు.
ఆ తర్వాత మూటను విప్పి ఒక్కొక్క వస్తువును బయట తీయసాగాడు. అప్పుడు మడత పెట్టి.. దారంతో కట్టిన ఓ కాగితం కనిపించింది. దారం విప్పి చూడగా.. అది బండ్ల గూడలో నాలుగేళ్లు తహసీల్దార్గా చేసిన షేక్ ఫర్హీన్ ఫొటోగా తేలింది. ఆ ఫొటోను తీయగా దాని వెనకాల ఉర్దూ అరభిక్ భాషలో రాసిన పదాలు కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : తొమ్మిది పెళ్లిళ్లు చేసుకున్న నిత్యపెళ్లికూతురు! పోలీసులకే సవాలు!