పంజాబ్ లోని జలంధర్ లోని మాలియన్ గ్రామంలో దారుణం జరిగింది. కొంత కాలంగా కబడ్డీ ప్రపంచాన్ని శాసించిన అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్.. స్టార్ రైడర్ సందీప్ నంగల్ సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం జలంధర్లోని మాలియన్ గ్రామంలో కబడ్డీ కప్ జరుగుతున్న సమయంలో సందీప్ సింగ్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతని తల, ఛాతిపై దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిపినట్లు తెలిసింది.
సందీప్ కేవలం పంజాబ్లోనే కాకుండా కెనడా, యుఎస్ఎ, యుకేలలో కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. భారతీయ కబడ్డీ పోటీదారైన సందీప్ ఖాతాలో అనేక విజయాలు ఉన్నాయి. కబడ్డీ ఆటలో అథ్లెటిక్ ప్రతిభ, నైపుణ్యం కారణంగా అతన్ని కొన్నిసార్లు డైమండ్ పోటీదారు అని పిలుస్తారు. సందీప్ నంగాల్ ప్రస్తుతం కబడ్డీ ఫెడరేషన్ నిర్వహిస్తున్నాడు. ఈ పోటీల్లో సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే సందీప్ను కొందరు కాల్చి చంపి పరారయ్యారు.
హంతకులు ప్రేక్షకుల ముసుగులో వచ్చి సందీప్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. కాగా, కబడ్డీ సమాఖ్యలో గొడవల కారణంగా సందీప్ను హత్య జరిగి ఉండవచ్చని డీఎస్పీ లఖ్వీందర్ సింగ్ అనుమానాన్నివ్యక్తం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
International Kabaddi player Sandeep Singh Nangal shot dead in #Jalandhar
It has started… the deterioration..
Mark my words.. AAP has no interest nor experience in running law & order.. especially in a border state..
I shudder to think what Punjab will become pic.twitter.com/x2VXxfPB8q
— Shehzad Jai Hind (@Shehzad_Ind) March 14, 2022