తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అత్యాచారమే కాకుండా నిందితులు బాలికపై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా తెలుస్తోంది. బాలిక ఒంటిపై 12 చోట్ల గాయాలను గుర్తించారు వైద్యులు. అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులకు అందించారు. కాగా, పోలీసులు ఇప్పటికే మైనర్కు రెండుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు.
కాగా, మెడికల్ రిపోర్ట్ ప్రకారం.. లైంగిక దాడి జరిగే సమయంలో మైనర్ మెడపై నిందితులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడినట్టు వెల్లడైంది. ఆ సమయంలో మైనర్.. లైంగిక దాడికి నిరాకరించడంతో నిందితులు ఆమెపై గోళ్లతో దాడికి పాల్పడ్డారు. దీంతో మైనర్ శరీరంపై 12 గాయాలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడు సాదుద్దీన్ మాలిక్ను రెండోరోజు పోలీసులు విచారిస్తున్నారు. సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. పబ్ లో బాలికను ట్రాప్ చేసిన అంశాల పైనా విచారించారు. ఇక, మైనర్పై లైంగిక దాడి కేసులో దర్యాప్తు అధికారులు తొలిరోజు మైనర్లను విచారించారు. జువైనల్ హోంలో ముగ్గురు మైనర్లను అధికారులు విడివిడిగా విచారించారు. కాగా, A1 సాదుద్ధీన్ చెప్పిన వివరాలతో అధికారులు ముగ్గురిని ప్రశ్నించారు. మైనర్ను ట్రాప్ చేసింది ఎవరూ అన్న కోణంలో దర్యాప్తు చేసినట్టు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Tamil Nadu: కన్న కూతురిపై తల్లి చెప్పుకోలేని దారుణం.. ఐదేళ్లుగా ప్రియుడితో కలిసి!అలాగే.. ఈ ఘటనలో బాలికతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు.