ఈ మద్య కొంత మంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. అమాయకుల బ్యాంక్ వివరాలు తెలుసుకొని కొంత మంది సైబర్ నేరగాళ్లు క్షణాల్లో అకౌంట్ లో ఉన్న డబ్బు మొత్తం ఊడ్చేస్తున్నారు. ఓ మహిళ తన కూతురు కోసం రూ.99తో ఇయర్ ఫోన్స్ కొన్న పాపానికి ఓ మహిళ నుంచి రూ. 33లక్షలు పోగొట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ సైబర్ కేటుగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. 3.50 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.29 లక్షలు ఫ్రీజ్ చేశారు. నాలుగు ఫోన్లు, 9సిమ్ కార్డులు, డెబిట్ కార్డులు, బ్యాంకు అకౌంట్స్ పాస్బుక్స్-5, ఆధార్, పాన్కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: సుడిగాలి సుధీర్ పై దారుణమైన ట్రోల్స్! ఫ్యాన్స్ ఫైర్!
రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలు ప్రకారం.. ఓ మహిళ ఆన్లైన్ క్లాసుల అటెండవుతున్న తన కుమార్తె కోసం ఈ కామర్స్ సైట్లో గతేడాది ఆగస్టులో రూ.99 విలువైన ఇయర్ఫోన్స్ను కొనుగోలు చేసింది. కొన్నిరోజులు తర్వాత మీరు కొన్న ఇయర్ ఫోన్స్ కి ఓ లక్కీ కూపన్ మీ పేరుపై తీశారని.. దానికి ఖరీదైన కారు గెల్చుకున్నారని సైబర్ కేటుగాడు మహిళను నమ్మించాడు. మీకు గిఫ్ట్ కావాలా లేదా అకౌండ్ లో నేరుగా డబ్బులు వేయాలా అని అడగడంతో ఆమె డబ్బు కావాలని కోరింది. సైబర్ కేటుగాళ్లు ప్రాసెస్ పేరిట ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ, ఇన్సూరెన్స్ చార్జీలు చెల్లించాలంటూ విడతల వారీగా రూ. 25.5 లక్షలు జమ చేయించుకున్నారు. అందులో మీకు రీఫండబుల్ గా మీ ఖాతాలోకి జమ అవుతాయని నమ్మించారు. అంతే కాదు ఆ మహిళ కు సంబంధించిన మరో బ్యాంక్ ఖాతా నంబర్ తెలుసుకుని అందులోని రూ.7.5లక్షలు కొల్లగొట్టారు.
ఇలా మొత్తం రెండు ఖాతాల్లో కలిపి రూ.33లక్షలు దోచేశారు. అయితే ఎంతకీ డబ్బు రిఫండ్ కాకపోవడంతో వారిని గట్టిగా నిలదీసింది ఆ మహిళ. దీంతో వారు ఫోన్లు స్విచాఫ్ చేశారు. ఇక తాను మోసపోయానని తెలుసుకొని రాచకొండ సీపీ మహేష్ భగవత్ను ఆశ్రయించి గోడు వెళ్లబోసుకుంది. కూతురు పెళ్లికోసం దాచిన డబ్బులు మొత్తం దోచేశారని తెలిపింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించి నిందితుల ఆట కట్టించారు. నిందితుడు రాజేష్ కుమార్ మహతోని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.