ఈ మద్య ఏ చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా వెంటనే ప్రైవేట్ హాస్పిటల్స్ కి వెళ్లడం కామన్ అయ్యింది. తాజాగా నగరంలోని పాతబస్తీ ఏరియాలో కొంత మంది వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దారుణం జరిగింది. చాదర్ ఘాట్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కొంత మంది ప్రైవేట్ వేడుక చేసుకుంటూ హంగామా చేశారు. తమ డాక్టర్ కూతురు వివాహం వచ్చే నెల జరగనుండటంతో ముందస్తుగానే సిబ్బంది పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో డీజేలతో డ్యాన్స్లు చేస్తూ ఆసుపత్రి సిబ్బంది వేడుకల్లో మునిగిపోయారు.
ఇదే సమయంలో ఓ మహిళ పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో హాస్పిటల్ లో చేరింది. అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్ గా ఉంది.. కానీ ఇక్కడ పార్టీలో మునిగితేలుతున్న వైద్య సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో సమయానికి వైద్యం అందక శిశువు చనిపోయింది. అదే సమయంలో తల్లి ఆరోగ్యం కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
శిశువు మరణానికి, తల్లి పరిస్థితి అలా కావడానికి వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణం అని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్పిటల్ కి చేరుకొని పరిస్థితి సమీక్షించారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతి చెందిన శిశువు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. సదరు ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.