ఆమె పేరు స్వప్న, వయసు 28 ఏళ్లు. ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ చెందిన ఈమెకు పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త, పిల్లలతో సంతోషంగా గడపాల్సింది పోయి పరాయి సుఖం కోసం పాకులాడింది. దీంతో పక్కంటి పిల్లాడిపై మనసు పడి తన వైపుకు తప్పికుంది. ఇంతటితో ఆగిందా అంటే అదీ లేదు. ఆంటీ.. ఆంటీ.. అంటూ ఇంట్లో అడుగు పెట్టిన ఆ బాలుడిని తన ముగ్గులోకి దింపుకుంది. మాయ మాటలు ఎన్నో చెప్పి తన కౌగిట్లో బందించుకుంది. అలాంటి విషయాల్లో ఎలాంటి అవగాహన లేని పసి పిల్లాడికి అన్నీ నేర్పించింది. గత కొన్ని రోజుల నుంచి ఆ వివాహిత ఎంచక్కా ఆ మైనర్ బాలుడితో శారీరక కోరికలు తీర్చుకుంది.
ఊళ్లో ఉంటే తన చీకటి సంసారం బయటపడుతుంది అనుకుందో ఏమో తెలియదు కానీ.., మాయమాటలు చెప్పి ఏకంగా ఈ నెల 19న ఆ బాలుడిని తీసుకుని హైదరాబాద్ కు చెక్కేసింది. ఇక నగరంలోని బాలానగర్ లోని ఓ ఇంట్లోకి దిగి బాలుడితో శారీరక కోరికలు తీర్చుకుంది. మంగళవారం సాయంత్రమైన బాలుడి ఆచూకి దొరకకపోవడంతో తల్లిదండ్రులు ఖంగారుపడ్డారు. అటూ ఇటు అంతా వెతికే క్రమంలోనే పక్కింటి వివాహిత కూడా కనిపించడం లేదంటూ వార్తలు వినిపించాయి.
దీంతో వివాహితపై అనుమానం రావడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు స్వప్ననే మా కుమారుడిని కిడ్నాప్ చేసిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్స్ సిగ్నల్ ఆధారంగా స్వప్న హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చేరుకున్న పోలీసులు ఆమె ఉన్న ఇంటికి చేరుకుని మైనర్ బాలుడితో పాటు స్వప్నను గుడివాడకు తీసుకెళ్లారు. అనంతరం ఆ మైనర్ బాలుడికి కౌన్స్ లింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో స్వప్నను విచారించగా పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ బాలుడితో గత కొంత కాలంగా చనువుగా ఉన్నానని, అతనితోనే జీవితాంతం ఉండాలని అనుకుని అతనిని తీసుకెళ్లినట్లు స్వప్న తెలిపింది. నిందితురాలు స్వప్నపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గుడివాడలో వెలుగు చూసిన ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అభం, శుభం తెలియని ఆ పసి పిల్లాడికి మాయమాటలు చెప్పి కోరికలు తీర్చుకోవాలని చూసిన స్వప్న తీరుపై స్థానికులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. 15 ఏళ్ల మైనర్ బాలుడిపై మనసుపడ్డ తీసుకెళ్లిన స్వప్న తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.