ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టాటా ఏస్ వాహనం రోడ్డుపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఎక్కింది. వాహనం బోల్తాపడకుండా ప్రయత్నించే క్రమంలో డ్రైవర్ ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో డ్రైవర్ సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. తుర్లపాడు మండలం రోలుగుంపాడు వద్ద ఒంగోలు- కర్నూలు రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది ఉన్నారు. బేస్తవారిపేట నుంచి వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మార్కాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి ముందు ఓ గేదె రోడ్డు దాటుతుండగా టిప్పర్ వాహనం దానిని ఢీకొట్టింది. గేదె అక్కడికక్కడే మరణించింది. టాటా ఏస్ వాహనం డ్రైవర్ చూసుకోకుండా గేదె కళేబరంపైకి ఎక్కించాడు. బండిని అదుపుచేసే క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. మృతులు దర్శి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.