ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఫైబర్ నెట్గా పనిచేసిన ఐఆర్ఎస్ అధికారి సాంబశివరావును సీఐడీ అరెస్ట్ చేసింది. ఫైబర్ నెట్ స్కాం కేసులో సాంబశివరావును సీఐడీ గతంలో విచారించింది. ఆయన ఫైబర్ నెట్ ఎండీగా ఉన్నప్పుడు టెరా సాఫ్ట్వేర్ కంపెనీకి లబ్ధిచేకూర్చానే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 18 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరికొందర్ని త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. భారీగా అక్రమాలు జరిగినట్లు సీఐడీ అధికారులు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది.