ఈ మధ్య కాలంలో బాలికలపై, యువతులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరిచి కొందరు తండ్రులు కూడా మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజుకు చాలానే జరుగుతు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ నడిబొడ్డున చంద్రయాణగుట్ట పరిధిలోని ఈ ఘటన కలకలం రేపింది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాతబస్తీ బండ్లగూడలోని గౌస్నగర్ ప్రాంతానికి చెందిన మహిళకు కూతురు(14), ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఆ మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా పిల్లలతో పాటు నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ 2017లో అంబర్పేటకు చెందిన వ్యాపారిని రెండో పెళ్లి చేసుకుంది. ఇక ఇప్పటికీ అతనికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. దీంతో అప్పడప్పుడు రెండవ భార్య వద్దకు వస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే ఆ మహిళ కూతురిపై కన్నేశాడీ కసాయి తండ్రి. దీంతో అలా అప్పడప్పుడు కూతురిని భయపెడుతూ శారీరకంగా వేధించేవాడట. ఇక కూతురిపై తండ్రి చేస్తున్న దారుణాన్ని పసిగట్టిన తల్లి ఈనెల 13న పోలీసులకు సమాచారం అందించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కసాయి తండ్రి కూతురిపై చేసిన ఘాతుకంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.